ఆర్జీవీ ఎఫ్‌బీ పోస్టులో "వీపు సుందరులు"

   

Last Updated : Oct 29, 2017, 08:36 PM IST
ఆర్జీవీ ఎఫ్‌బీ పోస్టులో "వీపు సుందరులు"

రామ్‌గోపాల్ వర్మ ట్విటర్ వదిలి ఇప్పుడు ఫేస్బుక్‌లో రెచ్చిపోతున్నాడు. ఆయన ఫేస్బుక్ పోస్టులు రోజు రోజుకీ వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవలే కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అనే వ్యక్తి "లక్ష్మీస్ వీరగ్రంథం" అనే సినిమాను తీస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఆ సినిమా పోస్టరు మీద వర్మ ఇటీవలే కామెంట్ చేశారు. ఆ పోస్టర్ పైనున్న హీరోయిన్ వీపు చాలా బాగుందని ప్రశంసిస్తూ ఫేస్బుక్‌లో పోస్టు చేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి, ఆ పోస్టరును రీడిజైన్ చేశారు వర్మ.

"లక్ష్మీస్ వీరగ్రంథం"  హీరోయిన్ వీపుపై వర్మ ఫోటోతో పాటు, మహేష్ బాబు, ఎన్టీఆర్, కేసీఆర్‌ల ఫోటోలు ముద్రించి "వీపు సుందరులు" అని టైటిల్ పెట్టి కొత్త పోస్టరు తయారుచేశారు వర్మ. ఇప్పుడు వర్మ తయారుచేసిన ఆ పోస్టరు ఆన్‌లైన్‌లో బాగా వైరల్ అవుతోంది. దాదాపు 3000 లైకులతో దూసుకుపోతుంది.  అయితే ఈ పోస్టుపై ఇప్పటికే మహేష్ బాబు ఫ్యాన్స్‌తో పాటు టీఆర్‌ఎస్ అభిమానులు కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. సంబంధం లేని విషయాలు పోస్టు చేస్తూ వర్మ, ప్రముఖ వ్యక్తుల పరువు తీస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన తన పంథా మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. 

 <

>

Trending News