అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం

అరుణాచల్ ప్రదేశ్ లో భూమి కంపించింది.

Last Updated : Jun 2, 2018, 01:45 PM IST
అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం

అరుణాచల్ ప్రదేశ్‌లో భూమి కంపించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్ జిల్లా తేజు నగరానికి 114 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది.

 

యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) ప్రకారం, ఈశాన్య పట్టణమైన తేజు నగరం సమీపంలో ఉదయం 11:16 సమయంలో భూమి కంపించిందని వెల్లడించింది. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Trending News