Mythri Movie Makers Conflict: మైత్రీ మూవీ మేకర్స్ లో ముసలం.. ముగ్గురిలో ఒకరు అవుట్..సొంత కుంపటి!

Cherukuri Mohan is Out of Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ముసలం ఏర్పడింది. ఈ క్రమంలో చెరుకూరి మోహన్ సంస్థ నుంచి తప్పుకున్నారని అంటున్నారు.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 26, 2022, 02:44 PM IST
Mythri Movie Makers Conflict: మైత్రీ మూవీ మేకర్స్ లో ముసలం.. ముగ్గురిలో ఒకరు అవుట్..సొంత కుంపటి!

Cherukuri Mohan is Out of Mythri Movie Makers: Planning a New movie with Nani in his Own Banner: స్థాపించిన కొన్ని రోజుల్లోనే కొన్ని సంస్థలు మంచి స్థాయికి వెళుతూ ఉంటాయి. అలాంటి సంస్థలలో మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఒకటి. 2015 వ సంవత్సరంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థను నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి అనే ముగ్గురు స్నేహితులు కలిసి ప్రారంభించారు. ముందుగా ఈ సంస్థ ద్వారా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసేవారు.

2015వ సంవత్సరంలో శ్రీమంతుడు అనే సినిమాతో వీరు సినీ రంగ ప్రవేశం చేశారు. శ్రీమంతుడు తర్వాత జనతా గ్యారేజ్, రంగస్థలం సినిమాలతో సూపర్ హిట్లు అందుకుని అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత వారు చేసిన సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీ వంటి సినిమాలు పెద్దగా అలరించకపోయినా చిత్రలహరి సినిమాతో పర్వాలేదనిపించుకున్నారు. తర్వాత చేసిన డియర్ కామ్రేడ్, గ్యాంగ్ లీడర్, మత్తు వదలరా సినిమాలు పెద్దగా కలెక్షన్లు తీసుకురాకపోయినా ఉప్పెన, పుష్ప సినిమాలతో మళ్లీ హిట్ల పరంపరలోకి వచ్చారు.

తర్వాత సర్కారు వారి పాట సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకున్నారు. తర్వాత చేసిన అంటే సుందరానికి, హ్యాపీ బర్త్డే, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమాలలో వరుస డిజాస్టర్లు అందుకున్నారు. కానీ వారు చేస్తున్న సినిమాల మీద ఇప్పుడు మరింత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ 107వ సినిమా, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య, పుష్ప రెండోభాగం కచ్చితంగా హిట్ అవుతాయని నమ్మకం అటు ప్రేక్షకులలో కూడా ఉంది.

ఇవి కాక విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే సినిమా కూడా చేస్తున్నారు. ఆ సినిమా కూడా హిట్ అవ్వచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న సంస్థలో ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలుస్తోంది. నిజానికి ముగ్గురిలో చెరుకూరి మోహన్ ఎప్పుడూ కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండేవారు కాదు. నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ మాత్రమే ప్రెస్మీట్లలో కూడా కనిపిస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు చెరుకూరి మోహన్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి తప్పకుంటున్నారని తెలుస్తోంది.

మిగతా ఇద్దరితో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ కొత్త ప్రొడక్షన్ తో ఏకంగా నాని హీరోగా సినిమా ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతుంది. ఈ ఏడాదిలోని ఈ సంస్థ ఏర్పాటు అవనుందని, ఏర్పాటయ్యాక దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే నాని ప్రస్తుతం బిజీగా ఉన్నారు కాబట్టి వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని అంటున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఏమేరకు  ఉన్నాయనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.

Also Read : Cricketers Meeting Ram Charan: అప్పుడు కాకా అన్నారు.. ఇప్పుడేమంటారు యాంటీస్.. కొత్త వాదన తెర మీదకు!

Also Read : Vijayasai Reddy on Chiranjeevi: చిరంజీవి గాడ్ ఫాదర్ పై విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్..ఇప్పుడెందుకు చెప్మా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News