Boiler Explosion in Muzaffarpur: నూడుల్స్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్...ఆరుగురు దుర్మరణం!

Boiler blast: నూడుల్స్​ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2021, 02:20 PM IST
  • నూడుల్స్ ఫ్యాక్టరీలో పేలుడు
  • ఆరుగురు మృతి, ఆరుగురికి గాయాలు
  • బీహార్ లోని ముజఫర్‌పూర్‌ జిల్లాలో ఘటన
Boiler Explosion in Muzaffarpur: నూడుల్స్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్...ఆరుగురు దుర్మరణం!

Boiler Explosion At Factory In Muzaffarpur: నూడుల్స్‌ ఫ్యాక్టరీ (noodles factory)లో బాయిలర్ పేలిన (Boiler blast) ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం బీహార్‌ ముజఫర్‌పూర్‌ జిల్లా (Muzaffarpur District) లోని బేలా పారిశ్రామిక ప్రాంతంలో ఉదయం 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. స్థానికులు సమాచారంతో.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని శ్రీకృష్ణా మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ జయంత్‌ కాంత్‌ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగే సమయంలో ఆ ఫ్యాక్టరీలో ఎంత మంది పనిచేస్తున్నారన్న సమాచారం తెలియరాలేదు. ఈ పేలుడు శబ్దం సుమారు 5 కిలోమీటర్లు వరకు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. పరిశ్రమలోని ఓ మిల్లు, భవనం సైతం ధ్వంసమైనట్లు సమాచారం. ఈ పేలుడు ధాటికి సమీపంలోని చాలా భవనాల గోడలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Also read: Muzaffarnagar Rape: ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం.. పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News