YSR Bima Scheme: వైఎస్ఆర్ బీమా పథకంలో కీలక మార్పులు, జూలై 1 నుంచి అమలు

YSR Bima Scheme: ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా వైఎస్ఆర్ బీమా పథకంలో కీలకమైన మార్పులు చేశారు. ఈ మార్పులు జూలై 1 నుంచి అమల్లో రానున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 9, 2021, 05:34 PM IST
 YSR Bima Scheme: వైఎస్ఆర్ బీమా పథకంలో కీలక మార్పులు, జూలై 1 నుంచి అమలు

YSR Bima Scheme: ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా వైఎస్ఆర్ బీమా పథకంలో కీలకమైన మార్పులు చేశారు. ఈ మార్పులు జూలై 1 నుంచి అమల్లో రానున్నాయి.

ఏపీలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాల్లో కీలకమైంది వైఎస్ఆర్ బీమా పథకం(Ysr Bima Scheme). సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ఆర్ బీమా పథకంలో మార్పులు చేశారు. జూలై 1 నుంచి కొత్త మార్పులతో అమలు చేయనున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. 18-50 ఏళ్ల వయస్సులో ఉండి.. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే లక్ష రూపాయలు, 18-70 ఏళ్లున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే 5 లక్షల రూపాయలు సహాయం అందించాలని వైఎస్ జగన్(Ap cm ys jagan) ఆదేశించారు.

పథకంలో కొత్తగా చేసిన మార్పులతో జూలై 1 నుంచి అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈలోగా సంపాదించే వ్యక్తుల మరణాలకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూలై 1 లోగా క్లెయిమ్‌లు అన్నింటినీ పరిష్కరించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో బీమా పరిహారం చెల్లించాలన్నారు. 
Also read: Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, 11 నుంచి భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News