Antarvedi chariot fire case: అంతర్వేది రథం దగ్ధం కేసులో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

అంతర్వేది ఆలయంలో రధం దగ్ధమైన ఘటనలో ( Antarvedi ratham fire case ) ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Last Updated : Sep 10, 2020, 10:25 PM IST
Antarvedi chariot fire case: అంతర్వేది రథం దగ్ధం కేసులో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

అమరావతి: అంతర్వేది ఆలయంలో రధం దగ్ధమైన ఘటనలో ( Antarvedi ratham fire case ) ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఉన్న భారీ రథం అగ్నికి ఆహుతి అవడాన్ని ఇప్పటికే తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( AP CM YS Jaganmohan Reddy ).. ఈ ఘటనపై కేసు విచారణను సీబీఐకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతర్వేది ఘటనపై ( Antarvedi ratham issue ) ఓవైపు పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పటికీ.. అక్కడ అన్యమత ప్రచారం జరుగుతోందని, పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ పారదర్శకతను నిరూపించుకునేందుకు వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ ఘటనలో సీబీఐ దర్యాప్తును కోరుతూ హోం శాఖకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం లేఖ రాసినట్టు తెలుస్తోంది. దీనిపై రేపు అధికారిక జీవో వెలువడనున్నట్టు సమాచారం. Also read : Antarvedi temple issue: రధం దగ్దంపై ప్రభుత్వం సీరియస్..ఈవో సస్పెన్షన్

అంతర్వేది రథం దగ్ధం ఘటన వెనుక ఉన్న దోషులు ఎవరైనా, ఎంతటివారైనా.. వారిని కఠినంగా శిక్షించేందుకు వైసిపి సర్కార్ సిద్ధంగా ఉందని చెప్పేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. Also read : Antarvedi radham issue: అంతర్వేది రథం దగ్ధం.. సర్కారుపై పవన్ ఘాటు వ్యాఖ్యలు

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x