Visakhapatnam tragedy: క్రేన్ కుప్పకూలి 10 మంది మృతి

Visakhapatnam crane tragedy వైజాగ్: విశాఖలో మరో విషాదం చోటుచేసుకుంది. హిందుస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్‌లో భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనలో 10 మంది మృతి చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం క్రేన్‌ను రోజువారి విధులలో భాగంగా చెక్ చేస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలింది.

Last Updated : Aug 1, 2020, 03:15 PM IST
Visakhapatnam tragedy: క్రేన్ కుప్పకూలి 10 మంది మృతి

Visakhapatnam crane tragedy వైజాగ్: విశాఖలో మరో విషాదం చోటుచేసుకుంది. హిందుస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్‌లో భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనలో 10 మంది మృతి చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం క్రేన్‌ను రోజువారి విధులలో భాగంగా చెక్ చేస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలింది. క్రేన్ కూలిన చోట ఉన్న 10 మంది సిబ్బంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

 

విశాఖను ఇటీవల వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. మొదట ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విష వాయువుల లీకేజీ ( Vizag gas leak tragedy) ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. ఆ ఘటనను నుంచి ఇంకా మర్చిపోకముందే ఇటీవల పరవాడ ఫార్మా సిటీలో ఓ కెమికల్ కంపెనీలో ట్యాంకర్ పేలిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఘటనలు మిగిల్చిన విషాదం నుంచి అక్కడి జనం ఇంకా తేరుకోకముందే మళ్లీ తాజాగా హిందుస్తాన్ షిప్ యార్డు ఘటనలో ( Hindustan Shipyard tragedy) పది మంది చనిపోవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

Trending News