ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో చంద్రబాబు సమావేశం..ఎందుకో తెలుసా ?

ఎన్నికలు జరిగిన తీరు ప్రశ్నించేందుకు దేశ వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు

Last Updated : Apr 18, 2019, 05:28 PM IST
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో  చంద్రబాబు సమావేశం..ఎందుకో తెలుసా ?

టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులు ఈ నెల 22న అమరావతిలోని పార్టీ  కార్యాలయంలో హాజరుకావాలని  చంద్రబాబు అదేశాలు జారీ చేశారు. ఈ రోజు అభ్యర్ధులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద్భంగా పోలింగ్ తీరుపై అనేక మంది సభ్యులు అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షం ఏం చెబితే ఈసీ ఆ పనిచేసిందని కొందరు అభ్యర్ధులు చంద్రబాబు దృష్టికి  తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న లోపు నివేదిక తయారు చేసి... అమరావతిలో జరిగే సమావేశానికి అందరూ హాజరుకావాలంటూ ప్రత్యేకంగా కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తమ పోరాటం వ్యక్తులపై కాదని..ఎన్నికల్లో జరిగిన అవకతవకలపైననని స్పష్టం చేశారు

ఎన్నికల నిర్వహణ తీరును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన పరిణామాలను దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అభ్యర్ధుల నుంచి సమచారం తీసుకొని ఈ మేరకు పోరాటాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్నారు.

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మిత్రపార్టీల తరఫున ఎన్నికల సభలకు హాజరయ్యారు. చంద్రబాబు ఈనెల 23 నుంచి మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. . ఈసారి ఉత్తరాది రాష్ట్రాల్లో చంద్రబాబు పర్యటన సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్ లోనూ ప్రచారం చేయాలని చంద్రబాబు ప్లాన్ చేసినట్లు తెలిసింది.

Trending News