పీవీ సింధుకు అవమానం

Last Updated : Nov 4, 2017, 01:30 PM IST
పీవీ సింధుకు అవమానం

భారత స్టార్ బ్యాట్మింటన్ క్రీడాకారిణి, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్ పీవీ సింధూకు ఘోర అవమానం కలిగింది. శనివారం ముంబాయికు బయలుదేరుతున్న సమయంలో విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది పోస్టు చేయడం తప్పో, కాదో నాకుతెలీదు. నాకు బాధ కలిగింది. అందుకే ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నాను అని పేర్కొంది. ఈ పోస్ట్ లో ఏముందటే.. 

"ఈ విషయం చెబుతున్నందుకు సారీ.. నాకు చాలా అవమానం జరిగింది. నేను ఈ రోజు ఉదయం బొంబాయి కు ఇండిగోకు చెందిన 6ఈ 608 విమానంలో బయలుదేరి వెళ్తున్నప్పుడు, గ్రౌండ్ స్టాఫ్ లో అజితేష్ అనే వ్యక్తి నన్ను అవమానించాడు" అని పీవీ సిందూ పేర్కొన్నారు. ట్విట్టర్ లో మూడు భాగాల ట్వీట్ ఉందని చెబుతూ పీవీ సింధూ '1/3' అని చివర పెట్టారు. 'నన్ను మన్నించండి.. అది ముంబై' అంటూ మరో పోస్ట్ చేశారు పీవీ సింధూ.

 

 

 

Trending News