Siddarth: యానిమల్ సినిమా పై కౌంటర్ వేసిన హీరో సిద్ధార్థ్.. వైరల్ అవుతున్న సెన్సేషనల్ కామెంట్స్

Animal: సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా చేసిన యానిమల్ సినిమా గత సంవత్సరం చివరిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా గురించి హీరో సిద్ధార్థ చేసిన వ్యాఖ్యలు మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 14, 2024, 04:42 PM IST
Siddarth: యానిమల్ సినిమా పై కౌంటర్ వేసిన హీరో సిద్ధార్థ్.. వైరల్ అవుతున్న సెన్సేషనల్ కామెంట్స్

Siddarth About Animal: అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సందీప్ రెడ్డి ఆ తరువాత కబీర్ సింగ్ చిత్రంతో నార్త్ లో కూడా మంచి అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఒకేసారి సౌత్, నార్త్ ప్రేక్షకులను అలరించడానికి గత సంవత్సరం చివరిలో రణబీర్ కపూర్ యానిమల్ సినిమాతో ఈ డైరెక్టర్ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ చిత్రం ప్రశంసలతో పాటు ఎన్నో విమర్శలు కూడా తెచ్చుకునింది. బాక్సాఫీస్ దగ్గర తెగ హవా చూపించిన ఈ చిత్రం ఎంతో మంది దగ్గర ఎన్నో విమర్శలు కూడా అందుకుంది. ఎంతోమంది ఈ చిత్రం కథని, ఈ సినిమాలో హీరో తీరుని నిందించారు. ఈ క్రమంలో ప్రస్తుతం హీరో సిద్ధార్థ యానిమల్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కొద్ది కాలంగా సరైన హిట్లేని సిద్ధార్థ కు చివరకు చిత్తా (తెలుగులో చిన్నా) అనే సినిమాతో మంచి విజయం వచ్చింది. గత సంవత్సరం విడుదలైన ఈ సినిమా తమిళంలో ఎంతో మంది దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంది. సిద్దార్థ్ తీసి, నటించిన చిన్నా మూవీ అందరినీ కదిలించింది. చిన్నపిల్లల పైన జరిగే అత్యాచారాలు, ఘోరాలను బేస్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కించారు. ఈ మూవీ ని చూసి ఎంతోమంది ఎమోషనల్ అయ్యారు. ఎంతోమంది ఈ చిత్రాన్ని ప్రశంసించగా తమిళంలో కమర్షియల్ గా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాకు గానూ సిద్ధార్థకు అవార్డు రాగా ఆ అవార్డును తీసుకుని.. అనంతరం స్టేజ్ మీద కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు సిద్ధార్థ్. 

 

 ఇన్డైరెక్ట్ గా యానిమల్ సినిమా గురించి చెబుతూ..సిద్దార్థ్..” మృగం (యానిమల్) లాంటి సినిమాలు చూసినప్పుడు మగవారికి ఎటువంటి ఫీలింగ్ కలగలేదు.. కానీ నా సినిమా చూసినప్పుడు మాత్రం వారు ఎందుకు చాలా డిస్టర్బెన్స్‌గా ఫీల్ అయ్యామని చెబుతున్నారు.. ఏ మహిళ కూడా నా దగ్గరకు వచ్చి అలా చెప్పలేదు.. చిత్తా మూవీని చూసి డిస్టర్బెన్స్‌ అయ్యామని ఏ అమ్మాయి చెప్పలేదు.. కానీ మగవాళ్లు చెబుతున్నారు.. అది నిజానికి డిస్టర్బెన్స్ కాదు.. గిల్టీ, సిగ్గుచేటు.. మున్ముందు అందరి మైండ్‌ సెట్‌లు మారతాయి’ అని చెప్పుకొచ్చాడు.

మామూలుగానే తమిళ సెలెబ్రిటీలు, క్రిటిక్స్‌కు సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమా అసలు నచ్చలేదు. యానిమల్ మీద ఎంతోమంది తమిళ సెలబ్రిటీలు ఎప్పుడూ ఏదో ఒక విమర్శ చేస్తూనే వచ్చారు. రాధిక, కుష్బూ, కస్తూరి వంటి వారంతా కూడా బహిరంగంగానే యానిమల్ మూవీని తిడుతూ వచ్చారు. ఇక ఇప్పుడు మళ్లీ ఎన్ని రోజుల తర్వాత సిద్ధార్థ కూడా ఇలా యనిమల్ చిత్రం గురించి ఇన్ డైరెక్ట్ గా మాట్లాడడం ప్రస్తుతం అందరి దృష్టిని మళ్లించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: తెలుగు నేలతో బాబా సాహెబ్ అంబేద్కర్ అనుబంధం..

Also Read: ఖమ్మం పాలిటిక్స్ లో కీలక పరిణామం.. భట్టి, తుమ్మల ఏకమై.. పొంగులేటికి చెక్..?

 

 

 

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News