Jeera-Saunf Water: సహజసిద్ధమైన ఈ డీటాక్స్ డ్రింక్ సేవిస్తే..30 రోజుల్లో స్థూలకాయం మాయం

Jeera-Saunf Water: ఆధునిక జీవన విధానంలో స్థూలకాయం ప్రధాన సమస్యగా మారింది. స్థూలకాయం ఎప్పుడైతే ఉంటుందో వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే ముందుగా స్థూలకాయానికి చెక్ పెట్టాల్సిన అవసరముంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 1, 2022, 11:42 PM IST
Jeera-Saunf Water: సహజసిద్ధమైన ఈ డీటాక్స్ డ్రింక్ సేవిస్తే..30 రోజుల్లో స్థూలకాయం మాయం

అధిక బరువు సమస్య నుంచి గట్టెక్కేందుకు, స్థూలకాయం తగ్గించుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు.  ఈ క్రమంలో కొన్ని సహజసిద్ధమైన డీటాక్స్ డ్రింక్స్ ఉపయోగిస్తే..మీ అధిక బరువు ఐస్ కరిగినట్టుగా కరిగిపోతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

ఆయుర్వేదంలో చాలా సమస్యలకు పరిష్కారముంది. క్షుణ్ణంగా తెలుసుకుని ఆచరిస్తే అద్భుత ఫలితాలు కన్పిస్తాయి. అదే విధంగా ఆధునిక జీవన విధానంలో ప్రధాన సమస్యగా మారిన స్థూలకాయానికి కూడా ఇందులో అద్భుతమైన వైద్య విధానముంది. అది సోంపు-జీలకర్రతో చేసే సహజసిద్దమైన డీటాక్స్ డ్రింక్.  ఈ డ్రింక్ తీసుకుంటే స్థూలకాయం సమస్య చాలా సులభంగా పోతుంది. 

అధిక బరువు తగ్గించేందుకు ఈ నేచురల్ డీటాక్స్ జ్యూస్‌ అద్భుతంగా పనిచేస్తుంది. మీ డైట్ సరిగ్గా ఉంటే స్థూలకాయం తగ్గించడం సులభమే. బరువు తగ్గేందుకు, హ్యాండ్సమ్, స్లిమ్ అండ్ ట్రిమ్‌గా మారేందుకు గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్లు చేయాల్సిన అవసరం లేదు. కేవలం జీలకర్ర, సోంపు నీళ్లు తాగితే చాలు. ఇదొక అద్భుతమైన డీటాక్స్ జ్యూస్. పూర్తిగా సహజసిద్దమైంది. ఇది సేవించడం ద్వారా బరువు గణనీయంగా తగ్గించుకోవచ్చు.

శరీరంలో మెటబాలిజం అనేది చాలా ముఖ్యం. ఇది సరిగ్గా ఉంటే ఏ విధమైన అనారోగ్య సమస్య తలెత్తదు. మెటబాలిజం సరిగ్గా లేకపోతేనే బరువు పెరగడం, తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే మెటబాలిజం ద్వారా కేలరీలు వేగంగా తగ్గుతాయి. సరైన భోజనం, బ్రేక్‌ఫాస్ట్ చేస్తే మెటబాలిజం స్థిరంగా ఉంటుంది. రోజూ జీలకర్ర, సోంపు నీళ్లు తాగడం వల్ల అతి ముఖ్యమైన మెటబోలిజం వృద్ధి చెందుతుంది. 

జీర్ణక్రియను బట్టే మనిషి ఆరోగ్యం లేదా అనారోగ్యం ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గించాలంటే పరిమితమైన ఆహారం తినడం, జీర్ణక్రియను మెరుగుపర్చడం చాలా అవసరం. పరిమితమైన భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. ఫలితంగా రక్త ప్రసరణ అన్నీ సవ్యంగా జరుగుతాయి. స్థూలకాయం నియంత్రణలో ఉంటుంది. సోంపు-జీలకర్ర డీటాక్స్ డ్రింక్‌తో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

ఉదయం వేళ సహజసిద్ధమైన పండ్ల జ్యూస్ తాగడం అవసరం. ఎందుకంటే అవసరానికి మించి భోజనం చేస్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఫలితంగా శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోయి..స్థూలకాయానికి దారితీస్తుంది. క్రమంగా ఒక్కొక్క రోగం చుట్టుముడుతుంది. 

Also read: Benefits Of Watermelon Seeds: లైంగిక సమస్యలతో బాధపడుతున్నారా.. ఎలాంటి ఖర్చు లేకుండా ఈ గింజలతో చెక్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News