Coronavirus: సీనియర్ వైద్యుడిని బలిగొన్న కరోనా.. సీఎం మమత నివాళి.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 60 ఏళ్ల సీనియర్ వైద్యుడు వారం రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. కాగా kolkataలోని ఆసుపత్రిలో చేరాడు. ఈ రోజు ఉదయం కోల్‌కతాలో

Last Updated : Apr 26, 2020, 05:26 PM IST
Coronavirus: సీనియర్ వైద్యుడిని బలిగొన్న కరోనా.. సీఎం మమత నివాళి.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 60 ఏళ్ల సీనియర్ వైద్యుడు వారం రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. కాగా kolkataలోని ఆసుపత్రిలో చేరాడు. ఈ రోజు ఉదయం కోల్‌కతాలో సీనియర్ వైద్యుడు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్ ఆరోగ్య సేవా విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బిప్లాబ్ కాంతి దాస్‌గుప్తా, రాష్ట్రంలో COVID-19తో మరణించిన మొదటి వైద్యుడు. మరోవైపు డాక్టర్ భార్య కూడా COVID-19 పాజిటివ్ అని తేలగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

 

Also Read: రేపు నిరాడంబరంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

వైద్యుడి మృతికి గాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి Mamata benarjeeనివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయన మన కోసం చేసిన త్యాగం మన హృదయాల్లో ఎప్పుడూ ఉంటుందని అన్నారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ వైద్యుల ఫోరం డాక్టర్ మరణానికి సంతాపం తెలిపింది. అతని భార్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

Read Also: వృద్ధురాలు సజీవ దహనం..!!

ఇదిలాఉండగా రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ వైద్యుడి మృతి అనంతరం పలుచోట్ల ఆసుపత్రుల్లో భయాందోళనలకు గురవుతున్నారని, మాకు మరింత Intensive Testingఅవసరమని ఫోరం ఒక లేఖలో తెలిపింది. ఇప్పటివరకు 8 మరణాలతో బెంగాల్‌లో 600కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

 

Trending News