జేఎన్ యూ విద్యార్ధులపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

జేఎన్‌యూ క్యాంపస్‌లో ఆదివారం ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. క్యాంపస్‌లోని 50 మంది గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా ప్రవేశించి దాడులు చేస్తూ, స్వైరవిహారం చేశారు. ముసుగులు ధరించి విద్యార్థులు, ప్రొఫెసర్లపై రాళ్లు, కర్రలతో దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. దీంతో ప్రొఫెసర్లకు, విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. 

Last Updated : Jan 5, 2020, 10:46 PM IST
జేఎన్ యూ విద్యార్ధులపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లో ఆదివారం ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. క్యాంపస్‌లోని 50 మంది గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా ప్రవేశించి దాడులు చేస్తూ, స్వైరవిహారం చేశారు. ముసుగులు ధరించి విద్యార్థులు, ప్రొఫెసర్లపై రాళ్లు, కర్రలతో దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. దీంతో ప్రొఫెసర్లకు, విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

అంతేకాకుండా విద్యార్థులపై యాసిడ్ దాడి కూడా జరిగినట్లు కొందరు పేర్కొంటున్నారు. ఈ దాడిలో పలు కార్లు, వాహనాలు కూడా ధ్వంసమైనట్లు సమాచారం. క్యాంపస్ లో  విద్యార్థులపై జరిగిన దాడిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. స్వరాజ్ అభియాన్ అధినేత యోగేంద్ర యాదవ్, పలువురు ప్రముఖులు  విద్యార్థులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News