Uttar Pradesh Accident: ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ కుంటలో పడి 22 మంది మృతి

Uttar Pradesh Tractor Accident: ఉత్తర్ ప్రదేశ్‌లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పూర్ జిల్లా ఘటంపూర్ సమీపంలో ఓ ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న నీటి గుంటలో పడిపోయింది. ట్రాక్టర్ ట్రాలీలో 50 మందికిపైగా ప్రయాణికులు ఉండగా.. ఈ ప్రమాదంలో 22 మంది చనిపోయారు. మృతులలో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. పదుల సంఖ్యలో జనం గాయపడినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉన్నావ్ సమీపంలోని చంద్రికా దేవి ఆలయానికి వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
చెరువులో ట్రాక్టర్ ట్రాలి బోల్తా పడి 22 మంది దుర్మరణం పాలైన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా చూడాల్సిందిగా యూపీ సీఎం అధికారులను ఆదేశించారు.

Also Read : Lal Bahadur Shastri Jayanti 2022: లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.. శాస్త్రి గురించి చాలామందికి తెలియని నిజాలు

Also Read : Gandhi Jayanti 2022: గాంధీ జయంతి చరిత్ర, ప్రాముఖ్యత, ప్రపంచ అహింసా దినోత్సవం నేపథ్యం

Also Read : Lal Bahadur Shastri Jayanti 2022: లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.. ఇండో-పాక్ వార్ హీరోకి నివాళి అర్పిస్తూ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

English Title: 
Uttar Pradesh tractor accident claims 22 women and children after tractor trolley falls into pond
News Source: 
Home Title: 

Uttar Pradesh Accident: ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ కుంటలో పడి 22 మంది మృతి

Uttar Pradesh Accident: ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ కుంటలో పడి 22 మంది మృతి
Caption: 
ANI Photo
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Uttar Pradesh Accident: ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ కుంటలో పడి 22 మంది మృతి
Pavan
Publish Later: 
No
Publish At: 
Sunday, October 2, 2022 - 04:08
Created By: 
Pavan Reddy Naini
Updated By: 
Pavan Reddy Naini
Published By: 
Pavan Reddy Naini
Request Count: 
54
Is Breaking News: 
No