పోలీసుల ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

Terrorists Killed In Kulgam Encounter | సరిహద్దుల్లో పాకిస్థాన్, చైనాలు తరచుగా భారత్‌తో కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. ఈ క్రమంలో కశ్మీర్‌లో చొరబడ్డ ఇద్దరు ఉగ్రవాదులను కాశ్మీర్ పోలీసులు, భద్రతా సిబ్బంది ధైర్యంగా ఎదుర్కొన్నారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు హతమయ్యారు.

Last Updated : Jul 17, 2020, 08:00 AM IST
పోలీసుల ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఉగ్రమూకలు ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా అని భారత్ సరిహద్దుల్లో నక్కి ఉన్నాయి. గత నెల రోజులుగా చైనా, భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదుల కదలికలు పసిగట్టిన కాశ్మీర్ పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు. కాశ్మీర్‌లోని కుల్గామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ (Kulgam Encounter)లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు భద్రతా సిబ్బంది స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు కరోనా పాజిటివ్

శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదుల కదలికలతో అప్రమత్తమైన పోలీసులు, భద్రతా బలగాలు నగ్నాడ్ - ఛిమ్మెర్ కూంబింగ్ ప్రారంభించాయి. కాల్పులకు తెగబడుతున్న ఉగ్రవాదులపై భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు చేసి ధైర్యంగా వారి చర్యను తిప్పికొట్టింది. ఎన్‌కౌంటర్‌లో తొలుత ఓ ఉగ్రవాదిని కాల్చి చంపిన (Terrorist Killed) సిబ్బంది, మరికాసేపటికి మరో ఉగ్రవాదిని సైతం మట్టుపెట్టారు. కాశ్మీర్ జోన్ పోలీసులు ఈ వివరాలు తెలిపినట్లు ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.   RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News