ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మంది మృతి

రహదారిపై పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి వంతెనపై నుంచి కాలువలో పడిపోయింది.

Last Updated : Mar 6, 2018, 11:33 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మంది మృతి

మంగళవారం గుజరాత్ లోని భావనగర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి వంతెనపై నుంచి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో 26 మంది మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు.  ఈ సంఘటన రాంగోలా సమీపంలో రాజ్కోట్-భావనగర్ రాష్ట్ర రహదారిపై జరిగింది.

గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన ప్రదేశానికి రెస్క్యూ టీంలు వచ్చాయి. కాగా పోలీసుల కథనం మేరకు ఈ బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

Trending News