ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దుర్మరణం!

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దుర్మరణం!

Last Updated : Dec 31, 2018, 03:59 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దుర్మరణం!

కచ్: గుజరాత్‌లోని కచ్ జిల్లా భచౌ వద్ద ఆదివారం జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతిచెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం వారి బంధువులను తీవ్ర విషాదానికి గురిచేసింది. భచౌ హైవైపై ఆదివారం సాయంత్రం భచౌ నుంచి భుజ్‌కు 11 మందితో వెళ్తున్న ఎస్‌యువి వాహనాన్ని ఎదురుగా ఉప్పు లోడుతో వస్తున్న ట్రక్కు బలంగా ఢీకొంది. ఉప్పు లోడుతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ని ఢీకొని, అవతలి రోడ్డుపై ఎదురుగా వస్తున్న ఎస్‌యువి వాహనాన్ని ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఎదురుగా వస్తున్న ట్రక్కుకు, వెనకాలే వస్తున్న మరో ట్రక్కుకు మధ్య చిక్కుకున్న ఎస్‌యువి వాహనం నుజ్జునుజ్జయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 11 మందిలో 10 మంది మృతిచెందగా మరొకరు తీవ్రగాయాలపాలయ్యారని కచ్ పోలీసులు తెలిపారు. 

ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని.. బాధితులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

Trending News