ప్రముఖ పంజాబీ గాయకుడిపై కాల్పులు

గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి పరారైనట్టుగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్పీ చెప్పారు. 

Last Updated : Apr 14, 2018, 05:24 PM IST
ప్రముఖ పంజాబీ గాయకుడిపై కాల్పులు

ప్రముఖ పంజాబీ గాయకుడు పర్మిష్ వర్మపై శుక్రవారం రాత్రి మొహలీలో గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పర్మిష్ వర్మని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మొహాలీలోని సెక్టార్ 91 వద్ద పర్మిష్ వర్మపై గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో అతడి కాలుకి బుల్లెట్ గాయాలైనట్టు మొహాలి ఎస్పీ కుల్దీప్ శాహల్ తెలిపారు. ప్రస్తుతం గాయకుడు పర్మిష్ వర్మ ఆస్పత్రిలో కోలుకుంటున్నారని ఎస్పీ మీడియాకు తెలిపారు. గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి పరారైనట్టుగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్పీ చెప్పారు. వర్మపై కాల్పులకు కారణం వ్యక్తిగత కక్షలా లేక మరేదైనా ఇతర కారణాలు వున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

'గాల్ ని కడ్ని' అనే పాటతో పంజాబీ గాయకుడిగా పాపులర్ అయిన పర్మిష్ వర్మ అనతి కాలంలోనే కెరీర్‌లో సింగర్‌గా నిలదొక్కుకున్నాడు. 

Trending News