Kala Bhairava Temple: కాలభైరవుడి సన్నిధిలో ప్రధాని మోదీ, ప్రత్యేక పూజలు

Kala Bhairava Temple: కలల ప్రాజెక్టు కాశీ విశ్వనాథ్ థామ్ ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ సందర్భంగా కాశీ చేరుకున్న మోదీ..కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 13, 2021, 01:57 PM IST
Kala Bhairava Temple: కాలభైరవుడి సన్నిధిలో ప్రధాని మోదీ, ప్రత్యేక పూజలు

Kala Bhairava Temple: కలల ప్రాజెక్టు కాశీ విశ్వనాథ్ థామ్ ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ సందర్భంగా కాశీ చేరుకున్న మోదీ..కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో ప్రధాని చేతుల మీదుగా కాశీ విశ్వనాథ్ థామ్(Kasi Viswanath Dham)ప్రారంభం కానుంది. దివ్య కాశీ- భవ్యకాశీ పేరిట జరగనున్న ఈ కార్యక్రమం నిమిత్తం కాశీ పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తొలిదశలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన 23 భవనాల్ని మోదీ ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 51 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. దేశంలోని ప్రముఖ శివాలయాలు, ఆశ్రమాల్లో ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటయ్యాయి. ఈ కార్యక్రమం కోసం వారణాసి చేరుకున్న ప్రధాని మోదీ(PM Modi)విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముందుగా కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలభైరవుడికి హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమం పురస్కరించుకుని వారణాసి నగరమంతా ప్రత్యేకంగా అలంకరించారు. 

Also read: Corona cases in India: దేశంలో తగ్గుతున్న కరోనా తీవ్రత- 561 రోజుల కనిష్ఠానికి యాక్టివ్​ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News