పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 9వ విడత డబ్బులు రేపే విడుదల

PM Kisan Samman Nidhi: రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల్ని రేపు మద్యాహ్నం రైతుల ఖాతాల్లో పడనున్నాయి. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 8, 2021, 07:03 PM IST
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 9వ విడత డబ్బులు రేపే విడుదల

PM Kisan Samman Nidhi: రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల్ని రేపు మద్యాహ్నం రైతుల ఖాతాల్లో పడనున్నాయి. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి(Pm kisan samman nidhi) యోజన 9వ విడత నగదు రేపు విడుదల కానుంది. రేపు మధ్యాహ్నం అంటే ఆగస్టు 9వ తేదీ మద్యాహ్నం 12.30 గంటలకు వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఈ నగదును నేరుగా ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. దేశంలోని 9.75 కోట్లకు పైగా లబ్దిదారుల కుటుంబ ఖాతాల్లోకి 19 వేల 5 వందల కోట్ల రూపాయలు జమ కానున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులతో ప్రధానమంత్రి సంభాషించనున్నారని ప్రదానమంత్రి కార్యాలయం తెలిపింది. 

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబానికి ఏడాది 6 వేల రూపాయల్ని మూడు విడతల్లో అంటే 2 వేల చొప్పున జమ చేస్తోంది. ఈ నగదును నేరుగా లబ్దిదారులైన రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ఈ పథకంలో ఇప్పటి వరకూ 1.38 లక్షల కోట్ల రూపాయల్ని సమ్మాన్ నిధికి బదిలీ చేశారు. రేపు జరగనున్న 9వ విడత రైతు సమ్మాన్ నిథి నగదు బదిలీ కార్కక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో(Narendra modi)పాటు వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొననున్నారు.

Also read: రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, థర్డ్‌వేవ్ ఎదుర్కొనేందుకు సన్నద్ధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News