PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పదవ విడత డబ్బులు ఎప్పుడు, e-Kyc తప్పనిసరి మరి

PM Kisan Samman Nidhi: అన్నదాతలకు శుభవార్త. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పదవ విడత వచ్చేస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధి పదవ విడత నిధుల విడుదలపై నెలకొన్న సందేహాలకు తెరపడింది. అన్నదాతల ఖాతాల్లో ఆ డబ్బులు ఎప్పుడు పడనున్నాయంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 28, 2021, 07:47 AM IST
PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పదవ విడత డబ్బులు ఎప్పుడు, e-Kyc తప్పనిసరి మరి

PM Kisan Samman Nidhi: అన్నదాతలకు శుభవార్త. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పదవ విడత వచ్చేస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధి పదవ విడత నిధుల విడుదలపై నెలకొన్న సందేహాలకు తెరపడింది. అన్నదాతల ఖాతాల్లో ఆ డబ్బులు ఎప్పుడు పడనున్నాయంటే..

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి (PM Kisan Samman Nidhi)సంబంధించి కీలకమైన ప్రకటన వెలువడింది. వాస్తవానికి లక్షలాదిమంది రైతన్నలు దేశవ్యాప్తంగా పదవ విడత కిసాన్ నిధి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్‌సైట్ నుంచి సూచనలు జారీ అయ్యాయి. పీఎం కిసాన్‌లో రిజిస్టరైన అన్నదాతలు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. ఆధార్ సంబంధిత ఓటీపీ ధృవీకరణ కోసం బయోమెట్రిక్ ధృవీకరణ కోసం మీ సమీపంలోని సీఎస్ సీ కేంద్రాల్లో ఈ కేవైసీ చేయించుకోమని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రకటించింది. పీఎం కిసాన్ ఈ కేవైసీ (e Kyc) ప్రక్రియ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు పరిశీలిద్దాం..

ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ సందర్శించాలి. మీ కుడి చేతివైపున హోమ్‌పేజీకు దిగువన ఫార్మర్స్ కార్నర్ ఉంటుంది. ఈ కార్నర్ దగ్గర ఈ కేవైసీని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కేవైసీ ఫెసిలిటేట్ కోసం పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి..సెర్చ్ బటన్ ప్రెస్ చేయాలి. ఆ తరువాత ఆధార్ కార్డుతో లింక్ అయున్న మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి..ఓటీపీ జనరేట్ చేసుకోవాలి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి..ధృవీకరణ బటన్ ప్రెస్ చేయాలి. అక్కడితో మీ పీఎం కిసాన్ ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. 

ఈ ప్రక్రియ పూర్తి కాగానే మీ ఖాతాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పదవ విడత డబ్బులు ( Pm kisan samman nidhi 10th installment) పడిపోతాయి. రైతుల ఖాతాల్లో పదవ విడత పీఎం కిసాన్ నిధి డబ్బులు జనవరి 1, 2022న పడనున్నాయని పీఎం  కిసాన్ సమ్మాన్ నిధి అధికారికంగా వెల్లడించింది. 

Also read: SBI CBO Recruitment : ఎస్బీఐ సీబీఓ ఆఫీసర్‌ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ, అర్హతలు.. ఎంపిక ప్రక్రియ..పూర్తి వివరాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News