మినీ బస్సు లోయలో పడి 8 మంది మృతి, ఐదుగురికి గాయాలు

లోయలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి, ఐదుగురికి గాయాలు

Last Updated : Oct 6, 2018, 11:09 AM IST
మినీ బస్సు లోయలో పడి 8 మంది మృతి, ఐదుగురికి గాయాలు

బస్సులు లోయలో పడి భారీ సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడుతున్న ఘటనలు ఒకటి మరువక ముందే మరొకటి చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్ కాశీ జిల్లాలో ఓ మిని బస్సు లోయలో పడిన ఘటనలో 8 మంది మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. భట్వరికి సమీపంలోని సోనాఘర్ లో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని జిల్లా ఆస్పత్రికి తరలించిన అధికారులు.. ఘటనా స్థలంలో సహాయచర్యలు ముమ్మరం చేశారు. రాష్ట్ర విపత్తు బృందాలు ఈ సహాయ చర్యల్లో పాల్పంచుకుంటున్నాయి.

Trending News