రెచ్చిపోయిన మావోయిస్టులు; 11 మంది జవాన్లకు గాయాలు

జార్ఖండ్ లో మావోయిస్టులు మరో మారు రెచ్చిపోయారు

Last Updated : May 28, 2019, 11:01 AM IST
రెచ్చిపోయిన మావోయిస్టులు; 11 మంది జవాన్లకు గాయాలు

జార్ఖండ్ లో భద్రతా సిబ్బందిని లక్ష్యం చేసుకొని మావోయిస్టుల మరోమారు రెచ్చిపోయారు. సరయ్‌కెల్లాలోని కుచాయ్‌ ప్రాంతంలో భద్రతా సిబ్బంది కాన్వాయ్ పై శక్తిమంతమైన ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ దాడిలో 11 మంది జవాన్లుకు తీవ్రగాయాలయ్యాయి.

క్షతగాత్రులకు మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌ సాయంతో రాంచీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన పలువురి జావన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

మావోయిస్టుల దాడిలో గాయపడిన వారిలో ఎనిమిది మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు, ముగ్గురు జార్ఖండ్‌ పోలీసుులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జార్ఖండ్‌ పోలీసులు, కోబ్రా బెటాలియన్‌కు చెందిన సిబ్బంది సంయుక్త ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది. 
 

Trending News