Kolkata murder case: ట్రైనీ డాక్టర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. తొలిసారి నోరు విప్పిన నిందితుడు సంజయ్ రాయ్ తల్లి.. ఏమందంటే..?

Trainee doctor murder case: కోల్ కతా ఘటన దేశంలో తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, నిందితులుడు సంజయ్ రాయ్ తల్లి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.   

Written by - Inamdar Paresh | Last Updated : Aug 23, 2024, 10:57 PM IST
  • తొలిసారి స్పందించిన నిందితుడు తల్లి..
  • ఘటనపై ఆసక్తికర వ్యాఖ్యలు..
Kolkata murder case: ట్రైనీ డాక్టర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. తొలిసారి నోరు విప్పిన నిందితుడు సంజయ్ రాయ్ తల్లి.. ఏమందంటే..?

Sanjay roy mother says daughters have abandoned me: కోల్ కతా హత్యచారం ఘటన దేశంలో తీవ్ర విషాదకరంగా మారిందని చెప్పుకొవచ్చు. జూనియర్ డాక్టర్ ను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన ఘటనపై యావత్ దేశం కూడా నివ్వేరపోయిందని చెప్పుకొవచ్చు. ఆగస్టు 9 న వెలుగులోకి వచ్చిన  ఈ ఘటనపై ఇప్పటికి కూడా ప్రజలు ఆగ్రహావేశాలు చల్లబడలేదు. ఇప్పటికి కూడా దీని వెనుక ఉన్నవారికి పనిష్మెంట్ చేయాలని కూడా డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం నిందితుడు సంజయ్ రాయ్ ను కోర్టు కస్టడీకి అప్పగించింది.

ఆగస్టు 9 న ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఘటన స్థలంలో సంజయ్ రాయ్ బ్లూటూత్ పడి ఉండటంతో, తొలుత సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత పలు టెస్టులలో యువతిపై సంజయ్ రాయ్ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్పష్టంగా బైటపడింది. సంజయ్ రాయ్ కు అశ్లీల వీడియోలకు బానిసై, విచ్చల విడిగా ప్రవర్తించేవాడని కూడా పోలీసులు గుర్తించారు.

ఘటనకు ముందు నిందితుడు.. యువతి చుట్టుపక్కల తిరిగిన వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి కోల్ కతా కోర్టు ఆదేశాల ప్రకారం సీబీఐ నిందితుడు సంజయ్ రాయ్ కు సైకో అనాలసిస్ ను నిర్వహించింది. అంతేకాకుండా.. అతను ఘటనకు ముందు అశ్లీల వీడియోలుచూసి, జంతువులగా ప్రవర్తించాడని కూడా తెలుస్తోంది. అతను ఘటనపై అనేక విస్తుపోయే విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఏమాత్రం కూడా.. తప్పుచేసినట్లు భావన అతనిలోలేదని కూడా సీబీఐ సైకో అనాలీసిస్ టెస్టులలో బైటపడింది. ఇదిలా ఉండగా.. నిందితుడు సంజయ్ రాయ్ తల్లి తాజాగా, చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.

పూర్తివివరాలు..

నిందితుడి సంజయ్ రాయ్ తల్లి మాట్లాడుతూ.. కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటనలో తన కొడుకును కావాలని ఇరికించారన వాపోయింది. దీని వెనక చాలా మంది ఉన్నారని,వారి గురించి విచారణ చేపట్టాలని కూడా సంజయ్ తల్లి డిమాండ్ చేశారు. చిన్నతనంలో సంజయ్ రాయ్‌కు ఆటలంటే చాలా ఇష్టమని తల్లి చెప్పింది. అలాగే బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడని చెప్పింది.

ఎన్‌సీసీలో కూడా చేరి... స్కూల్‌లో టాపర్‌గా నిలిచాడని చెప్పారు. ఇంట్లో తనను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ.. వంట కూడా చేసి పెడతారన్నారు. ఇరుగు పొరుగు వారితో సంజయ్.. ఎప్పుడు అమర్యాదగా ప్రవర్తించ లేదని చెప్పుకొచ్చింది..మరోవైపు సంజయ్ సోదరి కూడా ఈఘటనతో షాకింగ్ లోఉన్నట్లు చెప్పింది. తను తప్పుచేస్తే తప్పకుండా కఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలని కూడా చెప్పింది. 

భార్య మరణాన్ని తట్టుకో లేకపోయాడు..

ఇక సంజయ్ రాయ్ మొదటి భార్య క్యాన్సర్‌తో మరణించిందని చెప్పారు. అనంతరం అతడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడన్నారు. దాంతో మద్యానికి బానిసయ్యాడన్నారు. ఆ తర్వాత నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని చెప్పారు. ఇక ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఘటన చోటు చేసుకున్న రోజు రాత్రి అతడు ఏం తినలేదని చెప్పింది. అక్కడ అతడు పని చేస్తున్న పని చేస్తున్న విషయం సైతం తనకు తెలియదని వెల్లడించింది.

నిందితుడి అత్త..

ఇక నిందితుడి అత్త మాత్రం..  ఇప్పటికే సంజయ్ పై ఆరోపణలు గుప్పించింది. తనకూతురుని టార్చర్ పెట్టి గర్భస్రావం సైతం అయ్యేలా చేశాడని చెప్పింది. అతను తనకూతురును పెళ్లి జరిగిన ఆరునెలల నుంచి టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడని చెప్పుకొచ్చింది. కానీ.. ఈ నేరాన్ని అతను ఒక్కటే చేశాడంటూ మాత్రం తాను నమ్మనని చెప్పింది. దీని వెనుక కొంత మంది ఉండొచ్చని కూడా సంజయ్ రాయ్ అత్త చెప్పింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News