India Covid-19: దేశంలో 10 కోట్లు దాటిన కరోనా టెస్టుల సంఖ్య

భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసుల వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం 50 వేలకు తక్కువగా నమోదైన కేసులు కాస్త.. మళ్లీ 50వేలకు పైగానే నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. గత కొన్నిరోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగానే తగ్గింది.

Last Updated : Oct 24, 2020, 09:58 AM IST
India Covid-19: దేశంలో 10 కోట్లు దాటిన కరోనా టెస్టుల సంఖ్య

India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసుల వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం 50 వేలకు తక్కువగా నమోదైన కేసులు కాస్త.. మళ్లీ 50వేలకు పైగానే నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. గత కొన్నిరోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగానే తగ్గింది. దీంతోపాటు రికవరీ రేటు కూడా భారీగా పెరుగుతోంది. అయితే నిన్నటితో కరోనా టెస్టుల పరంగా భారత్ రికార్డును నమోదు చేసింది. ఇప్పటికీ దేశంలో చేసిన కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటింది. అంతేకాకుండా నిన్న రికార్డు స్థాయిలో 15 లక్షలకు చేరువలో పరీక్షలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

గత 24 గంటల్లో గురువారం ( అక్టోబరు 22న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 54,366 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 690 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,61,312 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,17,306 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గురువారం కరోనాతో 73,979 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి 69,48,497 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 6,95,509 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది.  Also read: Navratri Day 7: శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో అమ్మవారు

ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 89.53 శాతం ఉండగా.. మ‌ర‌ణాల రేటు 1.51 శాతం, యాక్టివ్ కేసుల రేటు 8.96 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. గురువారం దేశవ్యాప్తంగా 14,42,722 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి అక్టోబరు 22 వరకు మొత్తం 10,01,13,085 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. Also read: Coronavirus Vaccine: కోవ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌కు డీజీసీఐ అనుమతి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News