India: 53లక్షలు దాటిన కరోనా కేసులు.. నిన్న రికార్డు స్థాయిలో మరణాలు

భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ 90వేలకు పైగా కేసులు, వేయికి పైగా మరణాలు నమోదవుతునే ఉన్నాయి. అయితే గత 24గంటల్లో మళ్లీ రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. 

Last Updated : Sep 19, 2020, 10:18 AM IST
India: 53లక్షలు దాటిన కరోనా కేసులు.. నిన్న రికార్డు స్థాయిలో మరణాలు

Covid-19 updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ 90వేలకు పైగా కేసులు, వేయికి పైగా మరణాలు నమోదవుతునే ఉన్నాయి. అయితే గత 24గంటల్లో మళ్లీ రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. గత 24గంటల్లో శుక్రవారం ( సెప్టెంబరు 18న ) దేశవ్యాప్తంగా (India) కొత్తగా.. 93,337 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 1,247 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,08,015 కి పెరగగా.. మరణాల సంఖ్య 85,619 కి చేరింది. ఈ మేరకు శనివారం ఉదయం కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,13,964 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 42,08,432 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. Also read: Air India: దుబాయ్‌కు యథావిధిగా విమాన సర్వీసులు

ఇదిలాఉంటే.. శుక్రవారం దేశవ్యాప్తంగా 8,81,911 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 18 వరకు మొత్తం 6,24,54,254 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.  Also read: Urmila Matondkar: కంగనా అడల్ట్ స్టార్ కామెంట్‌పై ఊర్మిళ ట్వీట్

Trending News