Odisha: ఒడిశాలో పతీసహగమనం.. భార్య మరణం తట్టుకోలేక..!

Odisha: భార్య మృతిని తట్టుకోలేని ఓ భర్త ఆమె చితిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలోని కలహండి జిల్లాలో చోటుచేసుకుంది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 26, 2021, 01:34 PM IST
  • గుండెపోటుతో భార్య మృతి
  • తట్టుకోలేక భార్య చితిమంటల్లో దూకిన భర్త
  • అందరూ చూస్తుండగానే సజీవ దహనం
  • ఒడిశాలోని కలహండి జిల్లాలో ఘటన
Odisha: ఒడిశాలో పతీసహగమనం.. భార్య మరణం తట్టుకోలేక..!

Odisha: మనం సాధారణంగా సతీసహగమనం గురించి వినే ఉంటాం. ఏంటంటే...భర్త చనిపోతే ఆ చితిలోకి దూకి భార్య కూడా సజీవదహనం కావడం. కానీ ఒడిశా(Odisha)లో పతీసహగమనం జరిగింది. భార్య మరణించిందన్న నిజాన్ని  జీర్ణించుకోలేకపోయాడు ఓ భర్త. ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేక..మరణమే శరణ్యమనుకున్నాడు. భార్య చితిలోకి దూకి తనను తాను అర్పించుకున్నాడు. 

వివరాల్లోకి వెళితే...
భార్య మరణాన్ని తట్టుకోలేక, ఆమె చితిలోకి దూకి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒడిశా(Odisha)లోని కలహండి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని సియాల్జోడి గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరణించిన వ్యక్తిని నీలమణి సబర్‌ (65)గా గుర్తించారు. భార్య రైబారి (60) అంత్యక్రియల(Funeral)కు తన నలుగురు కుమారులతో పాటు ఆయన హాజరయ్యారు. చితికి నిప్పంటించాక సంప్రదాయం ప్రకారం పక్కనే ఉన్న నీటి మడుగు వద్దకు నలుగురు కుమారులు, బంధువులు స్నానానికి వెళ్లిన తర్వాత నీలమణి చితిలో దూకారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు.  

Also Read; chicken: శ్రావణమాసంలో భర్త చికెన్ తిన్నాడని..భార్య ఆత్మహత్య

ఈ ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామస్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. థమికంగా అందిన వివరాల ప్రకారం భార్య చనిపోయిందన్న బాధను తట్టుకోలేక బలన్మరణానికి(Suicide) పాల్పడినట్లు తెలుస్తోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook

Trending News