సంబరాలకు సిద్ధమౌతున్న కమలనాథులు

Last Updated : Dec 18, 2017, 11:26 AM IST
సంబరాలకు సిద్ధమౌతున్న కమలనాథులు

ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన జాబితాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు దాటి ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ 92కు పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.  ఐదో రౌండ్ ఫలితాల వరకూ విజయలక్ష్మి దోబూచులాడుతుండటంతో కాస్తంత ఆందోళనగా కనిపించిన బీజేపీ శ్రేణులు, ఆపై ఫలితాల సరళి తమకు అనుకూలంగా మారడంతో గాంధీనగర్ పార్టీ కార్యాలయం వద్ద కోలాహలం మొదలైంది. ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి మిఠాయిలు పంచుకుంటున్నారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలోనూ సంబరాలు ప్రారంభమయ్యాయి.

Trending News