బంగారం భగభగలు @రూ.49,000

బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. అయితే బంగారం ధరలు మరోసారి రూ.49 వేల మార్కును చేరుకున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : May 26, 2020, 08:41 AM IST
బంగారం భగభగలు @రూ.49,000

బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. అయితే బంగారం ధరలు మరోసారి రూ.49 వేల మార్కును చేరుకున్నాయి. దేశీయ కొనుగోళ్లు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి.

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.10 మేర అతి స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,000కి ఎగసింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,290కి చేరుకుంది. మల్టీ టాలెంటెడ్ భానుశ్రీ లవ్లీ ఫొటోషూట్

ఢిల్లీ మార్కెట్‌లోనూ నేడు వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. నిన్న రూ.210 మేర పెరిగిన బంగారం ధర నేడు రూ.10 మేర అతి స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,920కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,110కి ఎగసింది. 

బులియన్ మార్కెట్‌లో నేడు వరుసగా మూడోరోజూ వెండి ధర పెరిగింది. నేటి మార్కెట్‌లో రూ.10 మేర అతి స్వల్పంగా ధర పెరగడంతో 1 కేజీ వెండి ధర ధర రూ.48,360కి దిగొచ్చింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో కొనసాగుతోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్

Trending News