Sushant singh: రియా చక్రవర్తికు ఈడీ సమన్లు

మనీ లాండరింగ్ ( Money laundering ) అనుమానంపై బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి ( Rhea Chakraborty ) ఈడీ సమన్లు జారీ చేసింది. ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింహ్ రాజ్ పుత్ డబ్బుల్ని వ్యక్తిగతంగా వినియోగించుకోవడం, మనీలాండరింగ్ ఆరోపణలపై ఆమెను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించనుంది.

Last Updated : Aug 6, 2020, 03:08 PM IST
Sushant singh: రియా చక్రవర్తికు ఈడీ సమన్లు

మనీ లాండరింగ్ ( Money laundering ) అనుమానంపై బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి ( Rhea Chakraborty ) ఈడీ సమన్లు జారీ చేసింది. ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింహ్ రాజ్ పుత్ డబ్బుల్ని వ్యక్తిగతంగా వినియోగించుకోవడం, మనీలాండరింగ్ ఆరోపణలపై ఆమెను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించనుంది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింహ్ రాజ్ పుత్ ( Sushant singh Rajput death case ) మరణం కేసులో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుశాంత్ డబ్బుల్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడమే కాకుండా మనీ లాండరింగ్ ( Money laundering ) కు పాల్పడిందన్న ఆరోపణలపై విచారించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( Enforcement Directorate ) రంగంలో దిగింది. ఆగస్టు 17న విచారణకు హాజరుకావల్సిందిగా రియా చక్రవర్తికి సమన్లు పంపింది. ముంబాయి ( Mumbai ) లోని రెండు ఆస్థుల్లో రియా పెట్టిన పెట్టుబడికి నిధులు సుశాంత్  సింహ్ రాజ్ పుత్ ఎక్కౌంట్ నుంచి వచ్చాయా...లేదా మరెక్కడి నుంచి వచ్చాయనే కోణంపై ఈడీ విచారించనుంది. ఇప్పటికే రియా ఛార్టెడ్ అక్కౌంటెంట్ సందీప్ శ్రీధర్ ను విచారించింది. ఆ తరువాతే రియాకు సమన్లు పంపింది.

సుశాంత్ తండ్రి కేకే సింహ్ ( Sushant father Kk singh )..జూలై 28 న రియా, ఆమె కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. నేరపూరిత కుట్ర, మోసం చేసిందని ఆరోపించారు. షార్ట్ టైమ్ లో సుశాంత్ అక్కౌంట్ నుంచి రియా 15 కోట్ల రూపాయలు విత్ డ్రా చేసిందని కూడా ఆరోపించారుAlso read: ‘సుశాంత్‌ను సెలబ్రిటీ చేసింది ముంబై.. బిహార్ జోక్యమెందుకు’

Trending News