జెండా ఎగురవేసి పాట పాడిన ముఖ్యమంత్రి

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 

Last Updated : Aug 15, 2018, 04:29 PM IST
జెండా ఎగురవేసి పాట పాడిన ముఖ్యమంత్రి

72 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుక సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హమ్ హోంగే కామియాబ్ గేయాన్ని ఆలపించి ఆకట్టుకున్నారు. ఢిల్లీ ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేజ్రీవాల్.. ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం తమకు ఎదురవుతున్న అవరోధాలను ఏదో ఓ రోజు అధిగమిస్తాం అనే అర్థం వచ్చే ఈ పాటను పాడారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆ వీడియో ఇక్కడ మీ కోసం. 

 

Trending News