Breaking news: కరోనావైరస్ కాటుకు మరొకరు బలి

కరోనావైరస్ (Coronavirus) కాటుకు మరొకరు బలయ్యారు. కరోనాతో చనిపోయిన పేషెంట్‌కి తీవ్ర మధుమేహం, హై బీపీ, గుండె సంబంధిత జబ్బులతోనూ బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలోనే కరోనావైరస్ ఎటాక్ చేయడమే ఆ పేషెంట్ మృతికి కారణమైనట్టు సమాచారం.

Last Updated : Mar 22, 2020, 11:54 AM IST
Breaking news: కరోనావైరస్ కాటుకు మరొకరు బలి

ముంబై: కరోనావైరస్ (Coronavirus) కాటుకు మరొకరు బలయ్యారు. ముంబైలో కరోనావైరస్‌తో బాధపడుతున్న 63 ఏళ్ల పేషెంట్ నిన్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో భారత్‌లో కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య (Coronavirus death toll in India) 5కు చేరినట్టయింది. ముంబైలో చనిపోయిన పేషెంట్‌కి తీవ్ర మధుమేహం, హై బీపీ, గుండె సంబంధిత జబ్బులతోనూ బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలోనే కరోనావైరస్ ఎటాక్ చేయడమే ఆ పేషెంట్ మృతికి కారణమైనట్టు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News