ఉత్కంఠ భరితంగా ఉపపోరు ; మిశ్రమ ఫలితాలు వచ్చే ఛాన్స్

Last Updated : Jun 1, 2018, 12:03 PM IST
ఉత్కంఠ భరితంగా ఉపపోరు ; మిశ్రమ ఫలితాలు వచ్చే ఛాన్స్

పలు రాష్ట్రాల్లో వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన 4 ఎంపీ, 11 ఎమ్మెల్యే స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 11 అసెంబ్లీ స్థానాలకుగాను  బీజేపీ 5 స్థానాలు, కాంగ్రెస్ 4 స్థానాలు,  ఇతరలు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే మొత్తం జరిగిన నాలుగు ఎంపీ స్థానాలకు బీజేపీ 2 స్థానాల్లోనూ మహాకూటమి ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి. అంతిమ ఫలితం వచ్చే వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి. మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Trending News