లోయలోపడిన బస్సు.. 16 మంది దుర్మరణం

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Last Updated : Jul 19, 2018, 12:16 PM IST
లోయలోపడిన బస్సు.. 16 మంది దుర్మరణం

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 25 మందితో ప్రయాణిస్తున్న ఉత్తరాఖండ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు 250 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. రిషికేష్-గంగోత్రి హైవేపై సూర్యధర్‌కి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం 16 మంది చనిపోగా మిగతా వారికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక అధికార యంత్రాంగం, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఎయిమ్స్‌కి తరలించి మెరుగైన వైద్యం అందించేందుకుగాను హెలికాప్టర్లను ఉపయోగించాల్సిందిగా ఉత్తరాఖండ్ సర్కార్ ఆదేశాలు జారీచేసింది. 

ఈ దుర్ఘటనపై విచారణకు ఆదేశించిన ఉత్తరాఖండ్ సర్కార్.. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేలు నష్టపరిహారం అందించనున్నట్టు ప్రకటించింది. 

Trending News