Worst Food For Kidneys: 90 శాతం మందిలో కిడ్నీలను దెబ్బతి తీసే ఆహారాలు ఇవే..మీరు తింటున్నరా?

Worst Food For Kidneys: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి..వేటిని తినకపోవడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2024, 12:21 PM IST
Worst Food For Kidneys: 90 శాతం మందిలో కిడ్నీలను దెబ్బతి తీసే ఆహారాలు ఇవే..మీరు తింటున్నరా?

Worst Food For Kidneys In Telugu: శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా బాడీలోని అన్ని అవయవాలను కూడా హెల్తీగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆధునిక జీవనశైలిని అనుసరించేవారిలోని చాలా మందిలో గుండె, కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. దీంతో పాటు కొంతమందిలో తీవ్ర కిడ్నీ సమస్యలు కూడా వస్తున్నాయి. దీని కారణంగా శరీరంలోని మలినాలు పెరిగిపోయి. ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్‌లో కూడా అనేక సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా కొంతమంది మరణిస్తున్నారు. అయితే మీరు కూడా కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ఈ కింది ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
 
అరటిపండ్లు:
అరటి పండ్లతో పాటు కాయల్లో అధిక మోతాదులో పొటాషియం అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు వీటిని ఆహారాల్లో చేర్చుకోవడం వల్ల మరింత కిడ్నీలు దెబ్బతినే ఛాన్స్‌ ఉందని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కొంతమందిలో పొట్ట సమస్యలు కూడా రావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

వేయించిన బంగాళాదుంపలు:
బంగాళాదుంప కూడా  కిడ్నీలకు చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్ తినడడం వల్ల కిడ్నీల పని తీరును దెబ్బ తీస్తుంది. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల తీవ్ర కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి ఆహారాల్లో వేయించిన బంగాళాదుంప తీసుకోకపోవడం చాలా మంచిది.

కెఫిన్ కలిగిన డ్రింక్స్‌:
కాఫీ, టీ, సోడా డ్రింక్స్‌లో కెఫిన్‌ అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటిని కిడ్నీ సమస్యలు ఉన్నవారు ప్రతి రోజు తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై ఎఫెక్ట్‌ పడి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా కిడ్నీలపై ఒత్తిడి పెరుతుంది. దీని కారణంగా కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

ఉప్పు:
ఉప్పులో సోడియం పరిమాణాలు అధిక పరిమాణంలో లభిస్తుంది. దీని వల్ల రక్తపోటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మూత్రపిండాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారికి కొన్ని కొన్ని సందర్భంలో ఉప్పు అధిక మోతాదులో లభించే ఆహారాలు తీసుకోకపోవడం వల్ల కిడ్నీ సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

సోడా:
సోడాలో అధిక పరిమాణంలో చక్కెర పరిమాణాలు లభిస్తాయి. దీంతో పాటు ఇందులో పోషక విలువలు కూడా చాలా తక్కువగా లభిస్తాయి. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు సోడాను క్రమం తప్పకుండా తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News