Diabetes Control Tips: మధుమేహానికి చెక్‌ పెట్టడానికి.. అంజీరా ఆకుల టీని తీసుకోండి..

Diabetes Control In 2 Days: భారత్‌లో చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. ముఖ్యంగా 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసు వారే ఎక్కువ ఈ సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్య కరమైన ఆహారాలను అతిగా  తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలకు గురవుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 28, 2022, 03:53 PM IST
  • మధుమేహానికి చెక్‌ పెట్టడానికి..
  • అంజీరా ఆకుల టీని తీసుకోండి.
  • రక్తంలోని చక్కెర నియత్రణలో ఉంటుంది
 Diabetes Control Tips: మధుమేహానికి చెక్‌ పెట్టడానికి.. అంజీరా ఆకుల టీని తీసుకోండి..

Diabetes Control In 2 Days: భారత్‌లో చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. ముఖ్యంగా 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసు వారే ఎక్కువ ఈ సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్య కరమైన ఆహారాలను అతిగా  తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలకు గురవుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మందిలో  ఇన్సులిన్ అనే హార్మోన్‌ను విడుదల అవుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ వ్యాధి జన్యుపరంగా కూడా వస్తుంది. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామం చేయడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పలు రకాల పండ్లు కూడా దీని పై ప్రభావవంతంగా పని చేస్తుంది.

అయితే వీధుల్లో లభించే జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి బయట లభించే ఆహారాలను తీసుకోకపోవడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ సమస్య ఒత్తిడి కారణంగా కూడా ఉత్పన్నమవుతున్నాయని ఇటివలే నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి అంజీరా పండ్లు ప్రభావవంతంగా పని చేస్తాయని నిపుణులు పేర్కొన్నారు. మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా ఈ పండ్లను తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం కూడా తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అంజీరా పండ్లు:
అంజీరా పండ్ల ఆకులలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. అలాగే, ఇందులో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు వీటిని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇది రక్తంలోని చక్కెర పరిమాణాలను తగ్గించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఈ ఆకులను ఎలా తినాలి:
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అంజీర ఆకులతో తయారు చేసిన టీ తీసుకోవడం ద్వారా చక్కెర నియంత్రణలో ఉంటుంది. అయితే దీని కోసం ముందుగా ఆకులను నీటిలో వేసి మరిగించి..అందులో నీటిని వేరు చేసి టీలాగా తీసుకుంటే శరీరానికి ప్రయోజనాలు కలగడమేకాకుంగా మధుమేహం కూడా అదుపులో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు.

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News