మార్చిలో శ్రియ పెళ్లి..??

మార్చిలో శ్రియ వివాహం చేసుకుంటున్నారన్న వార్త  షోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

Last Updated : Feb 8, 2018, 11:01 AM IST
మార్చిలో శ్రియ పెళ్లి..??

డెహ్రాడూన్‌కి చెందిన నటి శ్రియా శరణ్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. పెళ్లి రాజస్థాన్‌లో మార్చిలో జరుగుతుందని సమాచారం. తెలుగు, తమిళం సహా దక్షిణాది భాషల్లో దశాబ్దం కాలంగా అనేక చిత్రాల్లో నటించిన శ్రియకు ఇటీవలి కాలంలో అవకాశాలు తగ్గాయి. దీంతో వ్యక్తిగత జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుందట. రష్యన్ స్నేహితుడితో పెళ్లిపై చర్చించేందుకు రష్యాకు వెళ్లిందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై శ్రియ వైపు నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.   

శ్రియ చివరిసారిగా తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన 'పైసా వసూల్' చిత్రంలో కనిపించారు. అదేవిధంగా ఫిబ్రవరి 9న విడుదలయ్యే 'గాయత్రి'లో కనిపించబోతున్నారు. 2001లో 'ఇష్టం' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చిన ఆమె 'సంతోషం' సినిమాతో మొదటిసారి కమర్షియల్ హిట్ అందుకున్నారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో రాణి పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు పొందారు. ప్రస్తుతం తెలుగులో 'వీర భోగ వసంత రాయలు' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు తదితరులు నటిస్తున్నారు.

Trending News