దుమ్మురేపుతున్న 'అల వైకుంఠపురములో'.. ట్రైలర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.

Last Updated : Jan 7, 2020, 01:25 PM IST
దుమ్మురేపుతున్న 'అల వైకుంఠపురములో'.. ట్రైలర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలకు ముందు సన్నాహకంగా ఏర్పాటు చేసిన 'అల వైకుంఠపురములో' మ్యూజికల్ కన్సర్ట్ ఉత్సాహంగా సాగింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను సంగీత ఢోలికల్లో ముంచెత్తించింది. ఈ సందర్భంగా  సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఐతే ట్రైలర్ విడుదలై 24 గంటలు గడవకుండానే 50 లక్షల వ్యూస్ సాధించింది. ఇప్పటికే ఈ సినిమా పాటలు 'సామజవరగమణ', 'రాములో.. రాములా' లక్షల మిలియన్లతో రికార్డులు సాధించాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా అదే స్థాయిలో దూసుకువెళ్తుండడం పట్ల చిత్ర యూనిట్  సంతోషం వ్యక్తం చేసింది.

ట్రైలర్ విశేషాలు.. 

సినిమా స్టోరీ ఎక్కడా తెలియకుండా  ట్రైలర్ కట్ చేయడం విశేషం. ఇందులో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి.  ఏదైనా పుట్టించే శక్తి నేలకి.. తరువాత వాళ్లకి(ఆడవాళ్లకి).. అంటూ త్రివిక్రమ్ డైలాగ్ లు సినిమాలో ఉన్నాయి. అంతే కాదు సినిమాలో మంచి కామెడీ ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. 'పులొచ్చింది.. మేక సచ్చింది' అనే డైలాగ్ కడుపుబ్బా నవ్విస్తుంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News