సినీ నిర్మాత దిల్ రాజుకు బెదిరింపులు

సినీ నిర్మాత దిల్ రాజు బుధవారం సీసీఎస్ పోలీసు స్టేషన్ లో తనను కొంతమంది బెదిరిస్తున్నట్టు, డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు పిర్యాదు చేశారు.

Last Updated : Dec 21, 2017, 11:04 AM IST
సినీ నిర్మాత దిల్ రాజుకు బెదిరింపులు

సినీ నిర్మాత దిల్ రాజు బుధవారం సీసీఎస్ పోలీసు స్టేషన్ లో తనను కొంతమంది బెదిరిస్తున్నట్టు, డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు పిర్యాదు చేశారు. మీడియాతో మాట్లాడుతూ- "నా 'ఎంసీఏ' చిత్రాన్ని  విడుదలకు ముందే పైరసీ చేస్తామని కొందరు నన్ను బెదిరిస్తున్నారు. డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు నా సినిమా 'జవాన్' కు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చాను" అన్నారు. 

 ఎంసీఏ సినిమాకే కాదు.. అజ్ఞాతవాసి సినిమాకు కూడా ఈ పైరసీ ఎఫెక్ట్ తగిలింది. దాంతో ఆ సినిమా నిర్మాత రాధాకృష్ణ కూడా దిల్ రాజుతో కలిసి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ రెండు సినిమాలు పైరసీ బారినపడటంతో టాలీవుడ్ లో కలకలం రేగింది. పైరసీల వల్ల టాలీవుడ్ సినీ పరిశ్రమకు దాదాపు వెయ్యి కోట్లు నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వానికి వందకోట్ల మేర ఆదాయానికి గండి పడుతోంది. 

Trending News