'ఎన్టీఆర్'ను ఎక్కడి వరకు తీయాలో తెలుసు: బాలకృష్ణ

Last Updated : May 28, 2018, 11:06 PM IST
'ఎన్టీఆర్'ను ఎక్కడి వరకు తీయాలో తెలుసు: బాలకృష్ణ

'ఎన్టీఆర్' సినిమా చరిత్రలో నిలిచిపోతుందని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. మహానాడు సభా ప్రాంగణంలో మాట్లాడుతూ ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి తెలుగువారి సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. టీడీపీని కేంద్రం ఎంత అణగదొక్కాలని చూస్తే అంత పైకెదుగుతుందని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే బాలకృష్ణ ఎన్టీఆర్ చిత్రంపై మాట్లాడారు. ఎన్టీఆర్ బయోపిక్‌ను ఎక్కడ నుంచి ఎక్కడ వరకు తీయాలో తనకు తెలుసునన్నారు. సంక్రాంతికి 'ఎన్టీఆర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఎన్టీఆర్ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహించనున్నారని.. ఎన్టీఆర్ ట్రైలర్‌కు మంచి ఆదరణ లభించిందని బాలకృష్ణ అన్నారు.

ఎన్టీఆర్ చిత్రానికి తొలుత తేజ దర్శకత్వం వహించేందుకు ముందుకువచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల తేజ ఆ చిత్రం నుంచి తప్పుకున్నారు. బాలకృష్ణ, ఆతరువాత పలువురు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ.. చివరకు క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు నిర్మాత బాలకృష్ణ  ఇటీవలే ప్రకటించారు.

Trending News