సరికొత్తగా NOKIA..

మార్కెట్లో ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను, ఫీచర్ ఫోన్లను అందించిన నోకియా, తాజాగా మరో ఫీచర్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. నేడు ఈ ఫోన్ హెచ్ఎండీ గ్లోబల్ ద్వారా మార్కెట్లోకి లాంచ్

Last Updated : Jun 16, 2020, 04:21 PM IST
సరికొత్తగా NOKIA..

హైదరాబద్: మార్కెట్లో ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను, ఫీచర్ ఫోన్లను అందించిన (NOKIA) నోకియా, తాజాగా మరో ఫీచర్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. నేడు ఈ ఫోన్ హెచ్ఎండీ గ్లోబల్ ద్వారా మార్కెట్లోకి లాంచ్ కానుందని, అయితే ఫోన్ ధర ఎంతన్న విషయం తెలియనప్పటికీ, ఆకర్షణీయమైన ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. దీన్ని 'నోకియా 5310' పేరిట విడుదల చేయనున్నట్టు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. 

Also Read: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

ఇదిలాఉంటే 2007లో విడుదలైన ఫోన్ కు కాస్త భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. 2.4 అంగుళాల స్క్రీన్, డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లతో పాటు ఎఫ్ఎం రేడియో, ఇన్ బిల్ట్ ఎంపీ 3 ప్లేయర్ దీనిలో ప్రధాన ఆకర్షణలుగా తెలుస్తోంది. ఇదే సమయంలో, 3.5 ఎంఎం హెడ్‌ ఫోన్ జాక్‌, 1200 ఎంఏహఎచ్ బ్యాటరీ, 8 ఎంబీ  ర్యామ్, వీజీఏ కెమెరా తదితర ఫీచర్లు కూడా ఉంటాయని నోకియా కంపెనీ పేర్కొంది. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News