మహర్షి మూవీ నిర్మిత దిల్ రాజుకు ఐటీ షాక్; కారణం ఇదేనా ?

ప్రముఖ  నిర్మాత దిల్ రాజు కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహించారు

Last Updated : May 8, 2019, 04:36 PM IST
మహర్షి మూవీ నిర్మిత దిల్ రాజుకు ఐటీ షాక్; కారణం ఇదేనా ?

హైదారబాద్: మహర్షి మూవీ నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు‌పై ఐటీ అధికారులు కన్నేశారు. ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లో ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక బృందంగా ఏర్పడిన ఐటీ అధికారులు .. అమీర్‌పేట శ్రీనగర్‌ కాలనీలోని  దిల్‌రాజు కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. 

భారీ బడ్జెత్ తో మహర్షి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని నిర్మించిన వారిలో దిల్ రాజు ఒకరు.  కాగా దిల్‌రాజుతో పాటు పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ), అశ్వనీదత్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

కాగా మూవీ రిలీజ్ కు ఒక్క రోజు ముందు ఈ ఈ దాడులు నిర్వహించడం గమనార్హం. దిల్ రాజుపై ఐటీ కన్నేయడానికి కారణం మహర్షి మూవీలో ఆయన పెట్టిన భారీ పెట్టుబడులే కారణమనే టాక్ వినిపిస్తోంది.

Trending News