లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండో ట్రైలర్‌లో ఘాటైన డైలాగ్స్

లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండో ట్రైలర్‌లో ఘాటైన డైలాగ్స్ 

Last Updated : Mar 8, 2019, 03:47 PM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండో ట్రైలర్‌లో ఘాటైన డైలాగ్స్

ల‌క్ష్మీ పార్వ‌తి దృష్టి కోణం నుండి ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని తెర‌కెక్కిస్తున్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్ విడుదల చేశాడు. ''వాడు, నా పిల్ల‌లు క‌లిసి నన్ను చంపేశారు'' అనే క్యాప్ష‌న్‌తో ట్రైల‌ర్‌ని ప్రారంభించిన వర్మ.. ల‌క్ష్మీ పార్వ‌తిని ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు దూషించ‌డం, పార్టీని త‌మ‌ చేతుల్లోకి తీసుకునేందుకు ప్ర‌ణాళిక‌లు రచించడం వంటి అంశాల‌ని ఈ ట్రైల‌ర్‌లో ప్రస్తావించాడు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పీ విజ‌య్ కుమార్ అనే ఓ రంగస్థల నటుడు ఎన్టీఆర్ పాత్రలో న‌టిస్తున్న ఈ సినిమాలో యజ్ఞాశెట్టి అనే నటి లక్ష్మీపార్వతి పాత్రను పోషిస్తున్నారు. వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్రలో కనిపించనున్నారు.

 

మే 22న ఆడియెన్స్ ముందుకు రానున్న ఈ సినిమాతో లక్ష్మీ పార్వతి ఏం కోల్పోయారో చెప్పదల్చుకున్నానని రామ్ గోపాల్ వర్మ చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

 

Trending News