సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అస్థికల్ని పవిత్ర గంగలో కలిపిన ఫ్యామిలీ

Sushant Singh Rajput Ashes | ఓ వైపు ముంబై పోలీసులు నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు గల కారణాలు, బాలీవుడ్‌కు చెందిన కొందరిని విచారిస్తున్నారు. మరోవైపు సుశాంత్ కుటుంబం అతడి అస్థికలు గంగలో కలపడం లాంటి శాస్త్రోక్త పనులు చేస్తోంది.

Last Updated : Jun 18, 2020, 04:30 PM IST
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అస్థికల్ని పవిత్ర గంగలో కలిపిన ఫ్యామిలీ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య (Sushant Singh Rajput Suicide) చేసుకుని చనిపోవడం తెలిసిందే. నేడు (జూన్ 18న) సుశాంత్ అస్థికల (Sushant Singh Rajput Ashes)ను అతడి కుటుంబసభ్యులు పవిత్ర గంగా నదిలో కలిపారు. తమ సొంత పట్టణం బిహార్ రాజధాని పాట్నాలో తీరానికి వెళ్లిన కుటుంబసభ్యులు సుశాంత్ అస్థికలను గంగా నదిలో కలిపి తమ బాధ్యతను నిర్వహించారు. జూన్ 14న ముంబై, బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరుసటిరోజు అంత్యక్రియలు నిర్వహించారు. సైనిక లాంఛనాలతో సంతోష్ బాబు అంత్యక్రియలు.. వీరుడికి వీడ్కోలు

సుశాంత్ ఆత్మహత్య కేసులో కుటుంబ సభ్యులు సహా 9 మందిని విచారించిన ముంబై పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. ముంబైలో ఉన్న ఓ సోదరి, సుశాంత్ చివరి రోజుల్లో సన్నిహితంగా మెలిగిన ఫ్రెండ్, నటి రియా చక్రవర్తిల వాంగ్మూలాలు త్వరలోనే సేకరించనున్నట్లు పోలీసులు తెలిపారు. సుశాంత్ ఆత్మహత్యకు కారణమైన వాళ్లను శిక్షించాలన్న డిమాండ్ పెరుగుతోంది. త్వరలో విచారణకు సుశాంత్ గాళ్‌ఫ్రెండ్, నటి

అదే సమయంలో సుశాంత్‌ది బలవంతవు ఆత్మహత్య అని అతడ్ని ఉద్దేశపూర్వకంగా ఇలా చేసుకునేలా చేశారంటే సల్మాన్ ఖాన్, కరణ్ జోహర్ సహా పలువురు బాలీవుడ్ నటీనటులు, నిర్మాతలు, నిర్మాణ సంస్థలపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేశ వ్యాప్తంగా సుశాంత్ పలువురు ప్రముఖులు, నెటిజన్ల నుంచి సుశాంత్‌ కుటుంబానికి మద్దతు లభిస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

Trending News