ముద్దమందారం 1 ఆగస్ట్ ఎపిసోడ్: గరిటె కాల్చి భవానికి వాత పెట్టిన మహి!!

ముద్దమందారం సీరియల్ తాజా ఎపిసోడ్‌లో సరికొత్త మలుపు తిరిగిన కథ

Last Updated : Aug 2, 2018, 04:41 PM IST
ముద్దమందారం 1 ఆగస్ట్ ఎపిసోడ్: గరిటె కాల్చి భవానికి వాత పెట్టిన మహి!!

మీ అభిమాన జీ తెలుగులో మీరు మెచ్చిన, మనసుకు నచ్చిన చక్కటి ముద్దమందారం సీరియల్ తాజా ఎపిసోడ్‌లో కథ సరికొత్త మలుపు తిరిగిన తీరు ఆకట్టుకుంటోంది. అఖిలాండేశ్వరికి ఇచ్చిన మాట నెరవేర్చుకునే పనిలో భవాని, పార్వతిని పక్కకు పిలిచి దేవాకు దూరంగా ఉండమని చెప్పి, ప్రమాణం చేయమంటుంది. అది విన్న మహి, వేడి వేడి గరిటతో భవాని చేతిని కాలుస్తాడు. దెబ్బకు భవానీ దారికొస్తుంది. 

 

అంతా తన కనుసన్నల్లో జరుగుతున్నాయని అఖిలాండేశ్వరి  రూపంలో వున్న చాముండేశ్వరి అనుకుంటున్న సమయంలో హాస్పిటల్‌లో జరిగిన విషయాల గురించి దేవా ఐష్, మహిలతో చర్చిస్తాడు. మహికి కాస్త అనుమానం ప్రారంభమైంది. ఏదో జరుగుతుందని పసిగడుతాడు. 
తమ కుటుంబంలో జరుగుతున్న గందరగోళాన్ని తెలుసుకోవడానికి శివశంకర్ కూడా సింద్ధాంతి గారిని పిలిపిస్తానంటాడు. మరుసటి రోజు, అనుకోకుండా వచ్చిన సిద్ధాంతిని చూసి చాముండేశ్వరి ఉలిక్కిపడుతుంది. జాగ్రత్తగా మసులుకోవాలనుకుంటుంది. మరి సిద్ధాంతి గారు ఈ చిక్కుముడిని విప్పగలరా లేదా అనేది సీరియల్ చూస్తే కానీ తెలిసే ఛాన్స్ లేదు! ఈ సీరియల్ ఎపిసోడ్స్‌ని ZEE5లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. 

Trending News