Rajinikanth: ధనుష్, ఐశ్వర్యలను కలపడానికి సూపర్ స్టార్ ప్రయత్నాలు.. ఫోన్ చేసి మరీ..!!

Rajinikanth: రజనీకాంత్ తన అల్లుడు ధనుష్‌, కూతురు ఐశ్వ‌ర్య‌కు మధ్య ఉన్న సమస్యను పరిష్కరించి వారిని త్వరగా కలపాలని కోరుకుంటున్నారట. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 09:35 AM IST
  • విడిపోయిన ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌
  • తీవ్ర మ‌నోవేద‌న‌కు గురవుతున్న ర‌జ‌నీకాంత్
  • ధనుష్, ఐశ్వర్యలను కలపడానికి సూపర్ స్టార్ ప్రయత్నాలు
Rajinikanth: ధనుష్, ఐశ్వర్యలను కలపడానికి సూపర్ స్టార్ ప్రయత్నాలు.. ఫోన్ చేసి మరీ..!!

Rajinikanth wants Aishwaryaa and Dhanush to reconcile: కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్‌ (Dhanush), డైరెక్టర్ ఐశ్వ‌ర్య‌ (Aishwaryaa )లు తమ వైవాహిక బంధానికి (Separation) వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 18 ఏళ్లు క‌లిసి జీవించిన వీరిద్ద‌రూ జ‌న‌వ‌రి 17న విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌ విడిపోయారన్న వార్త అభిమానులనే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా నచ్చడం లేదు. ధనుష్ తండ్రి కస్తూరి రాజా (Kasthuri Raja) స్టార్ కపుల్ విడిపోవడాన్ని కుటుంబ తగాదాగా చెప్పుకొచ్చారు. అంతేకాదు వారిద్దరూ మళ్లీ కలుస్తారని నమ్మకంగా ఉన్నారు.

తమిళ 'సూపర్ స్టార్' రజనీకాంత్ (Rajinikanth) తన కుమార్తె ఐశ్వ‌ర్య‌ విడాకుల వార్తతో తీవ్ర మ‌నోవేద‌న‌కు అయ్యారు. అయితే రజనీ తన అల్లుడు ధనుష్‌, కూతురు ఐశ్వ‌ర్య‌కు మధ్య ఉన్న సమస్యను పరిష్కరించి వారిని త్వరగా కలపాలని కోరుకుంటున్నారట. ఇప్పటికే రజనీకాంత్ ఈ విషయమై ధనుష్, ఐశ్వర్యలతో ఫోన్‌లో మాట్లాడి తన అభిప్రాయాలను వెల్లడించినట్లు సమాచారం. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. రజినీ మాత్రం ధనుష్, ఐశ్వర్యలను కలపడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

Also Read: Eesha Rebba Saree Pics: గ్లామర్ డోస్ పెంచేసిన ఈషా రెబ్బా.. తెలుగు అందం అదిరిందబ్బా!!

నిజానికి ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య మ‌ధ్య విబేధాలు వ‌చ్చిన ప్ర‌తిసారి సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ వాటిని ప‌రిష్క‌రించి ఇద్ద‌రినీ క‌లిపేవారట‌. అయితే ఈసారి తీవ్ర‌ స్థాయిలో గొడ‌వ‌లు రావ‌డంతో.. వారిద్ద‌రూ వాటిని ప‌రిష్క‌రించుకోవడానికి బ‌దులుగా విడిపోవ‌డానికే నిశ్చ‌యించుకున్నారు. దాంతో ర‌జ‌నీ లోలోనే కుమిలిపోతున్న‌ట్లు స‌మాచారం. అయితే ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య ఇంకా అధికారికంగా విడాకులు తీసుకోలేదని వార్తలు వచ్చాయి.

ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. యువ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ ‘సర్’ షూటింగ్ ప్రారంభించాడు. ఈ ద్విభాషా చిత్రం ఈ సంవత్సరం ఆఖరులోగా విడుదల కానుంది. 'రఘువరన్ బీటెచ్' సినిమాతో ధనుష్ తెలుగులో పెద్ద స్టార్ అయ్యారు. మారి, రైల్, మారి 2 సినిమాలతో తన మార్కెట్ మరింత పెంచుకున్నారు. 

Also Read: January 28 Horoscope: ఈ రాశి వారు.. వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News