Rajinikanth: తీవ్ర మ‌నోవేద‌న‌కు గురవుతున్న ర‌జ‌నీకాంత్.. కారణం ఏంటంటే?

Rajinikanth on Aishwaryaa-Dhanush's separation: ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌ విడిపోదామ‌ని నిర్ణ‌యించుకున్న‌ప్ప‌టి నుంచి ర‌జ‌నీకాంత్‌ తీవ్ర మ‌నోవేద‌న‌కు గురవుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 11:43 AM IST
  • విడిపోయిన ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌
  • తీవ్ర మ‌నోవేద‌న‌కు గురవుతున్న ర‌జ‌నీకాంత్
  • ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌ విడిపోవడం తాత్కాలికమే
Rajinikanth: తీవ్ర మ‌నోవేద‌న‌కు గురవుతున్న ర‌జ‌నీకాంత్.. కారణం ఏంటంటే?

Rajinikanth on Aishwaryaa-Dhanush's Separation: కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్‌ (Dhanush), డైరెక్టర్ ఐశ్వ‌ర్య‌ (Aishwaryaa)లు తమ వైవాహిక బంధానికి (Separation) వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. 18 ఏళ్లు క‌లిసి జీవించిన వీరిద్ద‌రూ 2022 జ‌న‌వ‌రి 17న విడిపోతున్న‌ట్లు (Aishwaryaa-Dhanush's Separation) ప్ర‌క‌టించారు. ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌ విడిపోయారన్న వార్త అభిమానులనే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా కలచివేస్తోంది. ముఖ్యంగా ఈ విషయాన్ని ఐశ్వ‌ర్య తండ్రి, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ జీర్ణించుకోలేక‌పోతున్నారు.

కూతురు, అల్లుడు విడిపోదామ‌ని నిర్ణ‌యించుకున్న‌ప్ప‌టి నుంచి ర‌జ‌నీకాంత్‌ (Rajinikanth) తీవ్ర మ‌నోవేద‌న‌కు గురవుతున్నట్టు కొన్ని క‌థ‌నాలు సోషల్ మీడియాలో వెలువ‌డుతున్నాయి. కూతురి జీవితాన్ని చ‌క్క‌దిద్దాల‌ని ఆయ‌న ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్నారట‌. 'రజినీ సర్ తన కుమార్తె విడిపోవడాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. తీవ్ర మ‌నోవేద‌న‌కు గురవుతున్నారు. ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌ విడిపోవడం తాత్కాలికమని రజనీ బ‌లంగా న‌మ్ముతున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గాలని తన కుమార్తెపై ఒత్తిడి చేస్తున్నారు' అని సుభాష్ కె ఝా పేర్కొన్నట్టు ఓ జాతీయ మీడియా తమ కథనంలో తెలిపింది.

Also Read: Janhvi Kapoor - Dinesh Karthik: జాన్వీ కపూర్‌కి పాఠాలు నేర్పుతోన్న టీమిండియా క్రికెటర్.. ఎందుకోసమో తెలుసా?

నిజానికి ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య మ‌ధ్య విబేధాలు వ‌చ్చిన ప్ర‌తిసారి సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ వాటిని ప‌రిష్క‌రించి ఇద్ద‌రినీ క‌లిపేవారట‌. అయితే ఈసారి తీవ్ర‌ స్థాయిలో గొడ‌వ‌లు రావ‌డంతో.. వారిద్ద‌రూ వాటిని ప‌రిష్క‌రించుకోవడానికి బ‌దులుగా విడిపోవ‌డానికే నిశ్చ‌యించుకున్నారు. దాంతో ర‌జ‌నీ లోలోనే కుమిలిపోతున్న‌ట్లు స‌మాచారం. అయితే ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య మ‌ధ్య విబేధాలు సూపర్ స్టార్ త్వరలోనే పరిష్కరిస్తారని చాలా మంది భావిస్తున్నారు. ధ‌నుష్‌, ఐశ్వ‌ర్యలు మళ్లీ కలుస్తారని ర‌జ‌నీకాంత్ కుటుంబం బలంగా నమ్ముతోంది. 

అయితే వివాదాలకు చాలా దూరంగా ఉండే ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య జంట.. అకస్మాత్తుగా విడిపోవడానికి కారణం ఇవేనంటూ అనేక కొన్ని వార్తలు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. కొన్నేళ్ల క్రితం జరిగిన సుచిలీక్స్ ఉదంతం కూడా ఓ కారణం అని తెలుస్తోంది. ధనుష్‌ ఓ హీరోయిన్‌తో చనువుగా ఉండటం ఐశ్వర్యకి నచ్చలేదని, అందుకే గత కొంతకాలంగా ఐశ్వర్య దూరంగా ఉంటుందని తెలుస్తోంది. ధనుష్‌కు ఉన్న అఫెర్లను చాలా కాలంగా భరిస్తూ వచ్చిన ఐశ్వర్య.. చివరకు చేసేదేమిలేక విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Also Read: Upasana FB Post: ఉపాసన ఫేస్‌బుక్‌ పోస్ట్‌పై రచ్చ రచ్చ.. డిలీట్ చేసెయ్‌ అంటోన్న నెటిజెన్స్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News