Simhadri Re Release: సినిమా కలెక్షన్స్ మళ్లీ ఫాన్స్ కే.. రీ రిలీజ్ లో కొత్త ట్రెండ్ సృస్టించనున్న సింహాద్రి

Simhadri Re Release Collections :  మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో 2003వ సంవత్సరంలో వచ్చి ఇండస్ట్రీ హిట్ అయిన సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేస్తుండగా కలెక్షన్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 11, 2023, 08:49 PM IST
Simhadri Re Release: సినిమా కలెక్షన్స్ మళ్లీ ఫాన్స్ కే.. రీ రిలీజ్ లో కొత్త ట్రెండ్ సృస్టించనున్న సింహాద్రి

Simhadri Re Release Collections to Fans: ఈ మధ్యకాలంలో ఒకప్పుడు సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలతో పాటు డిజాస్టర్ గా నిలిచిన సినిమాలను సైతం ఆయా హీరోల అభిమానులు చేస్తున్న రీ రిలీజ్ చేస్తున్న ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ సహా పలువురు టైర్ 2 హీరోల సినిమాలను కూడా ఆయా హీరోల అభిమానులు రీ రిలీజ్ చేశారు. అలా రిలీజ్ చేసినప్పుడు వచ్చిన డబ్బు చారిటీ కార్యక్రమాలకు వాడిన వారు కూడా ఉన్నారు.

అయితే మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ రీ రిలీజ్ కలెక్షన్స్ విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో అభిమానులు ఈ నిర్ణయం మీద ఆనందం వ్యక్తం చేస్తున్నారు అసలు విషయం ఏమిటంటే ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో 2003వ సంవత్సరంలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ అయిన సింహాద్రి సినిమాని ఈ సంవత్సరం మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే సోషల్ మీడియా ఫాలో అయ్యే వారందరికీ తెలుసు. అయితే తాజాగా ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

ఇది కూడా చదవండి: Vetrimaran on Jr NTR: ఎన్టీఆర్ సినిమాపై వెట్రిమారన్ క్లారిటీ.. ఆ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి?

అదేమిటంటే సింహాద్రి సినిమాని థర్డ్ పార్టీ దగ్గర ఒక ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసి దాన్ని రీ రిలీజ్ చేసి తమ అభిమాన హీరో ఎన్టీఆర్ పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకోవాలని సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే ఈ రిలీజ్ ద్వారా వచ్చే కలెక్షన్స్ ఫాన్స్ కే తిరిగి చేరాలనే ఉద్దేశంతో థర్డ్ పార్టీ దగ్గర సినిమా రైట్స్ తామే కొనుగోలు చేసి రీ రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు.

ఈ విషయం మీద ఎన్టీఆర్ అభిమానులు, అలాగే స్టేట్ కన్వీనర్స్  అందరూ కూడా మాట్లాడుకుని బయటి వాళ్లు ఎవరికి ఈ వసూళ్లు చేరకూడదు అనే ఉద్దేశంతో సినిమాని అభిమానులే రీలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ రీ రిలీజ్ అయిన తర్వాత వచ్చే వసూళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించిన కష్టాలలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు సాయంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు.

ఇదే మాట వారు ఎన్టీఆర్ దృష్టికి కూడా తీసుకువెళ్లారట, చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నారు అని ఆయన కూడా భుజం తట్టి ముందుకు వెళ్ళమని చెప్పారట. ఈ నేపథ్యంలో ఈ రీ రిలీజ్ కేవలం అభిమానులకు ఎంతో కొంత సహాయంగా ఉండడానికి చేస్తున్నాం తప్ప తమ స్వలాభం కోసమో వేరే ఉద్దేశంతోనో చేస్తున్నది కాదంటూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అభిమానుల డబ్బు అవసరంలో ఉన్న అభిమానులకి చేర్చడం అనే కాన్సెప్ట్ కాస్త కొత్తగా ఉండడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Balagam Director Venu: మా మనోభావాలు దెబ్బతీశాడు, చర్యలు తీసుకోండి.. బలగం డైరెక్టర్‌ వేణుపై ఫిర్యాదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News