నా పాత్రకు ఎల్టీటీఈ ప్రభాకరన్ స్ఫూర్తి

  

Last Updated : Nov 8, 2017, 09:06 PM IST
నా పాత్రకు ఎల్టీటీఈ ప్రభాకరన్ స్ఫూర్తి

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ త్వరలో విడుదల అవబోతున్న తన చిత్రం "ఒక్కడు మిగిలాడు" గురించి విశేషాలను ఈ రోజు మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఈ చిత్రంలో తాను సూర్య, పీటర్ అనే రెండు పాత్రలు పోషిస్తున్నానని..అందులో పీటర్ పాత్రకు శ్రీలంకలోని ఎల్టీటీఈ సంస్థ వ్యవస్థాపకుడు ప్రభాకరన్ క్యారెక్టరే స్ఫూర్తి అన్నారు. ఈ పాత్రలో సహజత్వా్న్ని తేవడానికి తాను ఊపిరి బిగ్గబట్టి మరీ నటించాల్సి వచ్చిందని.. అందుకు చాలా కష్టపడ్డానని తెలిపారు. కమర్షియల్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రాన్ని దర్శకుడు అజయ్ ఆండ్రూస్ చిత్రీకరిస్తున్నారని మనోజ్ తెలిపారు. అయితే సెన్సార్ పరంగా ఈ చిత్రానికి చాలా సమస్యలు ఎదురయ్యాయని.. అయితే వాటిని అధిగమించామని కూడా చెప్పారు. "ఒక్కడు మిగిలాడు"  చిత్రాన్ని పద్మజా ఫిలిమ్స్ ఇండియా లిమిటెడ్ నిర్మిస్తోంది. గోపీ మోహన్ కథను అందించిన ఈ చిత్రానికి శివ నందిగం సంగీతాన్ని  అందించారు. 

Trending News