Mega 156: ఇద్దరు గ్రీన్ సిగ్నల్.. మూడో హీరోయిన్ వేటలో చిరంజీవి దర్శకుడు

Chiranjeevi : బింబిసారా దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి చేయబోతున్న తన 156 వ సినిమా పైన ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉన్నాయి.. కాగా ఇప్పుడు ఈ సినిమాలోని హీరోయిన్స్ విషయమే పెద్ద చర్చగా మారింది.. సీనియర్ హీరోలకి ఒక హీరోయిన్ దొరకడమే కష్టం అంటే ఈ చిత్రంలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లను పెట్టుకొని ఉన్నారట చిత్ర దర్శకుడు..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2023, 08:00 AM IST
Mega 156: ఇద్దరు గ్రీన్ సిగ్నల్.. మూడో హీరోయిన్ వేటలో చిరంజీవి దర్శకుడు

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అలానే మెగాస్టార్ అభిమానులు అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా మెగా 156. చిరంజీవి కమ్ బ్యాక్ ఇచ్చిన తరువాత ఆయన రేంజ్ సినిమాలు ఆయన ఇప్పటివరకు తీయలేదని చెప్పాలి. వాల్తేరు వీరయ్య మినహా చిరంజీవి సినిమాలు బాక్స్ ఆఫీస్ ఆయన రేంజ్ లో వసూళ్లు కూడా ఈ మధ్య సాధించలేదు. దీనికి తోడు చిరంజీవి ఎక్కువ రీమేక్ సినిమాలపై మొగ్గు చూపిస్తూ ఉండడంతో అభిమానులు తెగ నిరాశ పడిపోయారు. ఈ నేపథ్యంలో చిరంజీవి అభిమానులకు ఎంతో సంతోషం కలిగించిన వార్త చిరంజీవి తన తదుపరి సినిమా బింబిసార లాంటి సూపర్ హిట్ తీసిన దర్శకుడు వశిష్ట తో తీస్తున్నారు చెయ్యబోతున్నారని ప్రకటించడం.

ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా ఈ మధ్య విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాగా ప్రస్తుతం అందుతున్న వార్త ప్రకారం దర్శకుడు ఈ సినిమా హీరోయిన్ల వేటలో ఉన్నట్టు తెలుస్తోంది. మామూలుగా సీనియర్ హీరోలు అంటే వాళ్లకి ఒక్క హీరోయిన్ ని సెట్ చేయగానే ప్రస్తుతం ఉన్న దర్శకులకు అలానే ప్రొడ్యూసర్లకు సవాల్ గా మారుతుంది. అలాంటి ఈ నేపథ్యంలో వశిష్ట ఏకంగా ఈ చిత్రంలో చిరంజీవి సరసన ముగ్గురు హీరోయిన్లని పెట్టాలనుకుంటున్నారు.

విశ్వాంబర అనే పేరుతో రాబోతున్న ఈ భారీ ఫాంటసీ మూవీ కి ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారినట్టు తెలుస్తోంది.‌ ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్కని అనుకున్నాడు… అయితే అనుష్క బల్క్ డేట్స్ ఇవ్వలేనని చెప్పడంతో ఇప్పుడామె స్థానంలో త్రిష వచ్చేసిందని ఫిలిం నగర్ టాక్. అంతేకాదు మన్సూర్ విషయంలో త్రిష కి చిరంజీవి సపోర్టుగా నిలవడం వెనక కారణం కూడా అదే అని వినిపిస్తోంది. ఇక మరో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ అంగీకారం తెలిపిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

దీంతో ఇద్దరు హీరోయిన్లు సెట్ అయ్యారు అని కాగా మూడో హీరోయిన్ కోసం వేట ఇంకా కొనసాగుతూనే ఉందని సమాచారం. కథ ప్రకారం అయిదు లోకాలను కలుపుతూ హీరో చేసే సాహస యాత్ర నేపథ్యంలో వశిష్ట పెద్ద కాన్వాస్ ని రాసుకున్నాడట. స్టోరీ తప్పకుండా హిట్ అయ్యేలాగా ఉండటంతో పైన చెప్పిన ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ సినిమా కథ వినగానే ఓకే చెప్పేసారట ఇక మూడో హీరోయిన్ కోసం తమన్నా, మెహ్రీన్, పూజా హెగ్డే, రాశి ఖన్నా పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆచార్య ఇష్యూ వల్ల కాజల్ పేరు మాత్రం అనుకోవడం లేదట వశిష్ట. 

ఇక పైన పరిశీలిస్తున్న వారిలో ఎవరు మూడో హీరోయిన్గా ఫిక్స్ అవుతారో తెలియాలి అంతే 
 కొంత టైం పట్టొచ్చు. ఇక ఈ సినిమా ప్రస్తుతం చిరంజీవి లేకుండా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకోగా మరో 10 రోజుల్లో చిరంజీవి కూడా ఈ షూటింగ్లో జాయిన్ అవుతారని సమాచారం.

Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు 

Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News